'హరి హర వీరమల్లు' పై ఈ వార్త FAKE నమ్మద్దు
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. మూడేళ్ళ క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే పూర్తి కాలేదు.
పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్లో 'హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్. రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథ ఇది. అందువలన ఆ కాలం నాటి కట్టడాల సెట్స్ కోసం భారీ మొత్తాన్నే ఖర్చు చేసి మరీ రూపొందిస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ అలరించనున్న ఈ చిత్రంపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటి వల్ల ప్రాజెక్టుకు వచ్చే నష్టమేదీ లేదు. కానీ తాజాగా మరో రూమర్ మీడియా స్ప్రెడ్ అయ్యింది.
అదేమిటంటే ఈచిత్రం ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు పవన్ కళ్యాణ్ కి నచ్చకపోవడం తో ఆయన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వ సారధ్యం లో రీ షూట్ చేయించాడట. మరికొన్ని సన్నివేశాల కోసం హరీష్ శంకర్ సహాయం కూడా తీసుకొని రీ షూట్స్ చేయించాడట.కేక్రిష్ మీద కోపంతో,పవన్ ఆయన్ను ప్రాజెక్టు నుంచి తప్పుకోమన్నారని ప్రచారం చేస్తున్నారు.
అలాగే ఈ సినిమాని త్రివిక్రమ్ హ్యాండోవర్ చేసుకున్నారని, ఆయన స్క్రిప్టులో మార్పులు చేసి , తన ఆధ్వర్యంలో దర్శకుడు కృష్ణ చైతన్య డైరక్ట్ చేస్తున్నారనీను. త్వరలో షూటింగ్ ఈ దర్శకుడుతో మొదలు కానుందని ఆ రూమర్ సారాంశం. అయితే అందులో నిజం లేదని సమాచారం. అది ఫేక్ వార్త అని టీమ్ ద్వారా తెలిసింది. కృష్ణ చైతన్య ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా #VS1 చేస్తున్నారు. జూన్ 14 నుంచి రాజమండ్రిలో షూటింగ్ మొదలు కానుంది. కాబట్టి అదంతా మీడియాలో ఓ వర్గం పుట్టించిన నిరాధారమైన ఫేక్ వార్తే. నమ్మాల్సిన పనిలేదు.
ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. మూడేళ్ళ క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే పూర్తి కాలేదు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మరియు ‘బ్రో’ చిత్రాలను పూర్తి చేసాడు. డైరెక్టర్ సుజిత్ తో ‘#OG’ చిత్రం షూటింగ్ లో కూడా చురుగ్గా పాల్గొంటూ అప్పుడే 30 శాతం షూటింగ్ ని పూర్తి చేసారు.మరోపక్క హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ని ప్రారంభించి ఒక షెడ్యూల్ ని పూర్తి చేసారు.ఇలా అన్నీ చకచకా పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ విషయం లో మాత్రం ముందడగు స్పీడుగా వెయ్యలేకపోతున్నారనేది మాత్రం నిజం. అందుకు చారిత్రక సబ్జెక్టు కావటమే కారణం అంటున్నారు.