Asianet News TeluguAsianet News Telugu

నిర్మాణం వైపు మహానటి చూపు.. క్లారిటీ ఇచ్చిన కీర్తి టీం!

మహానటి సినిమా తో జాతీయ స్థాయి లో పేరు తెచ్చుకున్న అందాల భామ కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత కూడా ఆసక్తికర సినిమాలతో అలరిస్తున్న ఈ భామ త్వరలో మరో టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలపై కీర్తి స్పందన ఎంటి..?

Keerthi suresh intrested in movie production
Author
Hyderabad, First Published Sep 5, 2020, 1:13 PM IST

అలనాటి అందాల నటి సావిత్రి పాత్రలో ఆకుట్టుకున్న ఈ జనరేషన్ హీరోయిన్ కీర్తి సురేష్. గ్లామరస్ హీరోయిన్స్ సత్తా చాటుతున్న సమయం లో ఎలాంటి అందాల ప్రదర్శనకు పోకుండానే తనదైన మార్క్ చూపించింది ఈ బ్యూటీ. ప్రజెంట్ హీరోయిన్ గా ఫుల్ బిజీ గా ఉన్న కీర్తి మరొబ్రంగం లో సత్తా చటెందు రెడీ అవుతుందట.

హీరోయిన్ గా కొనసాగుతూనే నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్న ట్టుగా వార్తలు వినిపించాయి. ఈ జనరేషన్ లో చాలా మంది హీరోయిన్లు సొంత బిజినెస్స్ లు చేస్తుండటం తో కీర్తి నిర్మాతగా మారటం ఖాయం అని భావించారు ఫ్యాన్స్.

కానీ తాజాగా ఈ వార్తల పై కీర్తి టీం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ దృష్టి అంతా నటన మీదే ఉందని.. ఇప్పట్లో నిర్మాతగా మారే ఉద్దేశం లేదని ప్రకటించారు. దీనితో కీర్తి నిర్మాతగా మారుతున్నారు వచ్చిన వార్తలన్నీ పుకర్లని తేలిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios