ధనుష్ ‘కర్ణన్’ ఓటీటి రిలీజ్ డేట్
ధనుష్ ‘కర్ణన్’ ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మే 14 నుంచి అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ తో చాలా మంది తెలుగు వాళ్లు సైతం ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారనటంలో అతిశయోక్తి లేదు.
బయిట థియోటర్ కు వెళ్లే పరిస్దితులు లేవు. దాంతో జనం ఓటీటిలలో సినిమాల రిలీజ్ ల కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఆ సందడే వేరు. తెలుగులో వకీల్ సాబ్ లో ఓటీటిలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు తమిళంలోనూ ధనుష్ ‘కర్ణన్’ ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మే 14 నుంచి అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ తో చాలా మంది తెలుగు వాళ్లు సైతం ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారనటంలో అతిశయోక్తి లేదు.
హీరో ధనుష్ తాజా చిత్రం ‘కర్ణన్’ ఏప్రియల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ వీక్ లో చెన్నై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టుకుంటుంది. అయితే ఆ తర్వాత కరోనా ఇబ్బందితో జనం థియోటర్స్ కు దూరం కావటంతో కలెక్షన్స్ గండిపడింది. అయినా తొలి ఐదు రోజుల్లో దాదాపు 40 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది కర్ణన్. ఒక వైపు కరోనా వైరస్ ఆంక్షలు కొనసాగిస్తున్న సమయంలోనూ ధనుష్ చెన్నై బాక్సాఫీస్ దగ్గర దమ్ము చూపించాడు.
వి.క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రంలో ధనుష్ సరసన రజీషా విజయన్ నటించారు. లాల్, యోగిబాబు ఇతర కీలక పాత్రలను పోషించారు. దర్శకుడు మారి సెల్వరాజ్ వాస్తవిక సంఘటనల ఆధారంగా చేసుకొని హార్డ్ హిట్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను తెరకెక్కించాడు.
మరో ప్రక్క ‘కర్ణన్’మూవీని ఇటీవల బెల్లకొండ సాయిశ్రీనివాస్ చూసి ఈ సినిమా కథ, ఎగ్జిక్యూషన్ తనకి బాగా నచ్చడంతో ‘కర్ణన్’ తెలుగు రీమేక్లో నటించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు రైట్స్ తీసుకున్నారు. ‘కర్ణన్’ సినిమా తెలుగు రీమేక్ దర్శకుడు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.