కమల్ హాసన్ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. `ఇండియన్ 2` తర్వాత స్టార్ట్ అయ్యేది ఇదే?
`విక్రమ్` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని జోష్లో ఉన్న కమల్ హాసన్ వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నారు. తాజాగా ఆయన మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.
లోకనాయకుడు మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. `విక్రమ్` చిత్రంతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయనకు హిట్ పడింది. అది కోలీవుడ్ కలెక్షన్ల రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా ఇచ్చిన జోష్తో వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నారు కమల్. ప్రస్తుతం ఆయన ఆగిపోయిన `ఇండియన్ 2` చిత్రాన్ని పట్టాలెక్కించారు. శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని ఈ ఏడాది రిలీజ్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే నెక్ట్స్ కమల్.. మణిరత్నంతో ఓ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. కెహెచ్234గా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీన్ని తన బ్యానర్లోనే నిర్మించబోతున్నారు కమల్. దీనితోపాటు `విక్రమ్ 2` కూడా చేయాల్సి ఉంది. దీనికి కొంచెం టైమ్ పడుతుంది. తాజాగా మరో సినిమాకి కమిట్ అయ్యారట కమల్. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఆల్మోస్ట్ ఈ చిత్రం ఫైనల్ అయ్యిందని, తన రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్ హాసన్ నిర్మించబోతున్నారట. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నట్టు టాక్.
హెచ్. వినోద్ చిత్రం మార్చిలో ప్రారంభం కాబోతుందని సమాచారం. `ఇండియన్ 2` తర్వాత నెక్ట్స్ ఈ మూవీనే కమల్ హాసన్ చేయబోతున్నట్టు టాక్. ఆ తర్వాత మణిరత్నం సినిమా ఉంటుందని తెలుస్తుంది. మణిరత్నం ఇప్పుడు `పీఎస్2`లో బిజీగా ఉన్నారు. ఈ సమ్మర్కి అది రాబోతుంది. ఆ తర్వాత ఆయన ఫ్రీ అవుతారు. కమల్ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించే ఛాన్స్ ఉందట.
ఇదిలా ఉంటే `సథురంగ వెట్టై` చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న వినోద్ `ఖాకి` చిత్రంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వరుసగా అజిత్తో సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలు చేయడం విశేషం. `నెర్కొండ పార్వై`(పింక్ రీమేక్), `వలిమై`, `తెగింపు`(తునివు) చిత్రాలు చేశారు. `తెగింపు` మూవీ సంక్రాంతికి విడుదలై భారీ సక్సెస్ని అందుకుంది. సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. ఇప్పుడు ఆయన కమల్ని డైరెక్ట్ చేయబోతుండటం విశేషం.
ఇదిలా ఉంటే `విక్రమ్` డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. విజయ్తో ఆయన 67వ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇమ్మిడియెట్గా ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. ఇందులో హీరో విక్రమ్ విలన్గా కనిపించబోతున్నారట. అంతేకాదు కమల్ గెస్ట్ రోల్లో కనిపిస్తారని సమాచారం.