`కల్కి` అక్కడ మరో రికార్డు.. తన రికార్డులపై కన్నేసిన ప్రభాస్..
ప్రభాస్ నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. అక్కడ సరికొత్త సంచలనంగా మారింది. ప్రభాస్ ఇప్పుడు తన రికార్డులపైనే కన్నేశాడు.
ఇప్పుడు ఎక్కడ చూసిన `కల్కి 2898 ఏడీ` సినిమా గురించే చర్చ నడుస్తుంది. ఇండియన్ సినిమాలోనే ఓ కొత్త రకమైన జోనర్లో సినిమా రావడం ఓ విశేషమైతే, సైన్స్ ఫిక్షన్కి, పురాణాలు జోడించడం మరో విశేషం. మహాభారతంలోని ఎలిమెంట్లని టచ్ చేయడంతో `కల్కి` సినిమా నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. రెండు జోనర్లని బ్లెండ్ చేసిన తీరు, ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా చేసిన తీరు సినిమాలో హైలైట్ పాయింట్గా చెప్పొచ్చు.
మహాభారతం ఎలిమెంట్లే సినిమాని నిలబెట్టాయి. ప్రభాస్ హీరోయిజం, అమితాబ్ బచ్చన్ యాక్షన్, దీపికా ఎమోషన్స్, కైరా లవ్, కమల్ హాసన్ విశ్వరూపం సినిమాకి మెయిన్ ఎలిమెంట్లుగా నిలిచాయని చెప్పొచ్చు. దీంతో సినిమాని అన్ని వర్గాల ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. దీంతో సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతుంది. ప్రస్తుతం ఈ మూవీ తొమ్మిది రోజుల్లో 800కోట్లు దాటింది. శనివారం, ఆదివారం `కల్కి`కి బాగా కలిసి వస్తుంది. యాభై కోట్లకుపైగా కలెక్షన్లు వస్తాయని చెప్పొచ్చు. ఇలా వచ్చే వారంలో ఈ మూవీ వెయ్యి కోట్లు దాటుతుంది.
ఇక ఈ సినిమా ఓ చోట మాత్రం సరికొత్త రికార్డుల దిశగా వెళ్తుంది. నార్త్ అమెరికాలో దుమ్ము రేపుతుంది. అక్కడ మరో రికార్డు దిశగా వెళ్తుంది. తాజాగా మరో మైల్ స్టోన్కి చేరుకుంది. 15 మిలియన్ డాలర్ల కలెక్షన్లని పూర్తి చేసుకుంది. అంటే 125కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. దీనికంటే ముందు `బాహుబలి 2`, `జవాన్` చిత్రాలున్నాయి. `జవాన్ 17 మిలియన్స్, `బాహుబలి 2` 20 మిలియన్స్ డాలర్లు వసూలు చేశాయి. లాంగ్ రన్లో `కల్కి` ఈ రికార్డులను బ్రేక్ చేయబోతుంది. అంతేకాదు తన రికార్డులను తానే బ్రేక్ చేయబోతున్నాడు ప్రభాస్.
ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 250కోట్లకుగాపై వసూళ్లని రాబట్టిందట. తెలంగాణలోనే వంద కోట్లు దాటింది. నార్త్ ఇండియా, తమిళం, కన్నడ, మలయాళం కలిసి రెండు వందల కోట్లు దాటింది. ఓవరాల్ ఓవర్సీస్లో ఇది 300కోట్లు క్రాస్ చేయబోతుందట. ఇప్పుడైతే ఈ సినిమా కలెక్షన్లు ఆగేలా లేవు. మరి `భారతీయుడు 2` వరకు కొదవ లేదు. ఆ సినిమా బాగుంటే దీనిపై ప్రభావం పడుతుంది. లేదంటే ఈ నెల మొత్తం `కల్కి` జాతరే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నాగ్ అశ్విన్ రూపొందించిన `కల్కి 2898 ఏడీ`లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఆర్జీవీ, రాజమౌళి, అనుదీప్, బ్రహ్మానందం వంటి వారు నటించిన విషయం తెలిసిందై. వైజయంతి మూవీస్ ఆరు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించారు. సినిమాకి 372కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఇప్పుడు అన్నీ ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయ్యిందని సమాచారం.