మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస సూపర్ హిట్స్ ఇచ్చిన  కొరటాల శివకి  ఈ చిత్రం తొలి ఎదురుదెబ్బ.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస సూపర్ హిట్స్ ఇచ్చిన  కొరటాల శివకి  ఈ చిత్రం తొలి ఎదురుదెబ్బ. మెగా అభిమానులైతే ఈ ఫెయిల్యూర్ ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొరటాల స్క్రిప్ట్, దర్శకత్వం పూర్తిగా బెడిసికొట్టాయి.  

ఈ చిత్ర బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు దారుణంగా నష్టపోయారు. తాజా సమాచారం మేరకు కొరటాల శివ ఆఫీస్ వద్ద సీడెడ్ కి చెందిన ఎగ్జిబిటర్లు ధర్నా చేస్తున్నట్లు సమాచారం. ఆచార్య వివాదానికి కొరటాల శివ కేంద్రంగా మారడంతో.. ఆయన అభిమానులు జస్టిస్ ఫర్ కొరటాల శివ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 

చిరంజీవి, రాంచరణ్ లని తప్పుబడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఈ చిత్ర బిజినెస్ లో కొరటాల శివ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అందుకే కొరటాలకి ఈ చిక్కులు వచ్చి పడ్డాయి. మెగా అభిమానులైతే కొరటాల శివని తీవ్రంగా తప్పుబడుతూ ట్రోల్ చేస్తున్నారు. 

కథ, దర్శకత్వంపై ఫోకస్ పెట్టకుండా సినిమా బిజినెస్ పైనే కొరటాల శివ ద్రుష్టి పెట్టాడు అని.. అవుట్ పుట్ ని గాలి కొదిలేయడంతో ఆచార్య చిత్రం దారుణంగా పరాజయం చెందింది అని అంటున్నారు. కొరటాల శివ నుంచి ఇంత దారుణమైన చిత్రం ఫ్యాన్స్ అసలు ఊహించలేదు. 

ఆచార్య వివాదం ముదురుతుండడంతో కొరటాల దీనిని ఎలా అధికమిస్తారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. దీనితో కొరటాల ఫ్యాన్స్ ఆయనకి మద్దతుగా జస్టిస్ ఫర్ కొరటాల అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. ఆచార్య డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో కొరటాల ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. దీనితో ఆయనే మా నష్టాలు భర్తీ చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.