Asianet News TeluguAsianet News Telugu

తిత్లీ ఎఫెక్ట్: బాధితులకు జీవిత, రాజశేఖర్ పదిలక్షల సాయం!

తిత్లీ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర అల్లకల్లోలమైంది. శ్రీకాకుళం జిల్లాలోని 165 గ్రామాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఆస్థి నష్టం ఎక్కువగా జరిగింది.  ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నా.. సినీ పరిశ్రమ కూడా బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది

jeevitha rajasekhar donates 10 lakhs to cm relief fund
Author
Hyderabad, First Published Oct 24, 2018, 11:01 AM IST

తిత్లీ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర అల్లకల్లోలమైంది. శ్రీకాకుళం జిల్లాలోని 165 గ్రామాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఆస్థి నష్టం ఎక్కువగా జరిగింది.  ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నా.. సినీ పరిశ్రమ కూడా బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది.

ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి తారలు ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాలను అందించారు. తాజాగా జీవితా రాజశేఖర్ దంపతులు కూడా తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం తమ వంతు సాయంగా రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అమరావతిలో ఆయన స్వగృహంలో నేరుగా కలుసుకొని రూ.10 లక్షల చెక్ ను అందించారు. 

ఇవి కూడా చదవండి.. 

‘‘తిత్లీ’’ తుఫాను బాధితులకు అన్నదమ్ముల సాయం

 

Follow Us:
Download App:
  • android
  • ios