Asianet News TeluguAsianet News Telugu

'జాతి రత్నాలు' డైరక్టర్... నెక్ట్స్ ఖరారు, హీరో ఎవరంటే

 దాంతో గత కొద్ది నెలలుగా అనుదీప్ తన తదుపరి చిత్రం ఏ హీరోతో చెయ్యబోతున్నాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. రకరకాల హీరోలు పేర్లు బయిటకు వచ్చాయి. ఫైనల్ గా ఓ తమిళ హీరో ఫైనల్ అయ్యారని సమాచారం.

Jathi Ratnalu director next movie with Siva Karthikeyan JSP
Author
Hyderabad, First Published Jul 13, 2021, 2:25 PM IST

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో అనుదీప్ తెరకెక్కించిన ‘జాతి రత్నాలు’ చిత్రం మార్చి 11న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తొలి నాలుగు రోజుల్లోనే రూ. 34 కోట్ల గ్రాస్ రాబట్టి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాట పట్టించింది. ఇక ఈ సక్సెస్ కు కారణం ...నవీన్ పోలిశెట్టి అద్బుతమైన కామెడీ టైమింగ్ అయితే దర్శకుడు అనుదీప్ వన్ లైనర్స్ అనేది అందరూ ఒప్పుకున్న సత్యం. దాంతో గత కొద్ది నెలలుగా అనుదీప్ తన తదుపరి చిత్రం ఏ హీరోతో చెయ్యబోతున్నాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. రకరకాల హీరోలు పేర్లు బయిటకు వచ్చాయి. ఫైనల్ గా ఓ తమిళ హీరో ఫైనల్ అయ్యారని సమాచారం.
 
వివరాల్లోకి వెళితే..'జాతి రత్నాలు' దర్శకుడికి అది మొదట సినిమాకాదు. పిట్టగోడ అనే సినిమా అంతకు ముందు చేసారు. ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాతో మంచి విజయం సాధించాడు. దాంతో అందరీ దృష్టీ ఈ డైరక్టర్ నెక్ట్స్ ఏ సినిమా చేయబోతున్నాడనేదానిపై పడింది. ఈ మేరకు మీడియాలో రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. ఓ ప్రక్కన రామ్ తో ఆయన ప్రాజెక్టు చేయబోతున్నారని కొందరు, అదేం లేదు   ఇక  అనుదీప్‌ తన తర్వాతి చిత్రాన్ని మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తో తీస్తున్నారని మరికొందరు తమదైన శైలిలో ప్రచారం చేసేసారు. పైనల్ గా తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో సినిమా చేస్తున్నారని సమాచారం. 
 
 అనుదీప్‌కీ, హీరో శివకార్తికేయన్‌కీ మధ్య ప్రస్తుతం కథా చర్చలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఈ కలయికలో  సినిమాని ఆసియన్ సినిమాస్ సంస్ద నిర్మించనుంది. ఇదే సంస్థలోనే ధనుష్‌ - శేఖర్‌ కమ్ముల సినిమా రూపొందనుంది. . సునీల్ నారంగ్ నిర్మాణ వ్యవహారాలు చూస్తారు.  ఆసియన్ సినిమాస్ అధినేత నారాయణ్ కే దాస్ నారంగ్ నిర్మిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios