Asianet News TeluguAsianet News Telugu

‘ఇష్క్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్,నితిన్ సరే అన్నాడనే...

తేజ సజ్జా, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్‌’. నాట్‌ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ఎస్ ఎస్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. 

Ishq to hit the screens on July 30th! jsp
Author
Hyderabad, First Published Jul 21, 2021, 7:24 AM IST


కరోనా కాటుతో విలవిల్లాడిన తెలుగు పరిశ్రమ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. సినిమాలు రిలీజ్ కు ముస్తాబు అవుతున్నాయి.వెండి తెరమీద సినిమా ను ఆస్వాదించాలనుకునే సినీప్రేమికులకు విందు భోజనం అందనుంది. ఒక్కొక్కటిగా సినిమాలు థియటర్‌ విడుదలకు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన ‘ఇష్క్‌’ను థియేటర్‌లోనే విడుదల చేస్తామని చిత్ర టీమ్ ప్రకటించింది. జూలై 30 ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.

 తేజ సజ్జా, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్‌’. నాట్‌ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ఎస్ ఎస్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్‌ 23నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్‌ పడింది.  తాజాగా థియేటర్లు తెరుచుకున్న కారణంగా ఈ నెల 30న థియేటర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర టీమ్ అనౌన్స్‌ చేసింది.

 తేజ సజ్జా మాట్లాడుతూ ‘‘ఇదొక కొత్త రకం కథ. ‘జాంబీరెడ్డి’ తర్వాత నేను చేసిన సినిమా ఇది. ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తిస్తుంది. కొంత విరామం తర్వాత మెగా సూపర్‌ గుడ్‌ సంస్థ నాతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇదే పేరుతో నితిన్‌ సినిమా చేశారు. మీ సినిమా పేరు వినియోగిస్తున్నాం అనగానే నితిన్‌ సరే అనడంతో ముందుకు వెళ్లాం’’అన్నారు.

 దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఛాయాగ్రాహకుడు సమీర్‌రెడ్డి వల్లే నాకు ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాని 29 రోజుల్లో ఇంత నాణ్యంగా పూర్తి చేయడానికి కారణం నిర్మాతలు, ఛాయాగ్రాహకుడు శ్యామ్‌ కె.నాయుడు. తేజ, ప్రియా, తమిళ నటుడు రవీందర్‌తోపాటు చిత్రబృందం అంతా చక్కటి సహకారం అందించింది. మహతి మంచి సంగీతం అందించారు’’అన్నారు.

చెల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన తేజ సజ్జా జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. జాంబిరెడ్డితో హిట్‌ ఇచ్చిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతోనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి హనుమాన్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.  
 

Follow Us:
Download App:
  • android
  • ios