త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ ..వడ్డీతో వెనక్కి ఇమ్మంటున్నారు!?
టైమ్ బాగోపోతే రకరకాల సమస్యలు వస్తూంటాయని సినిమావాళ్ళ నమ్ముతూంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే ప్రముఖ రచయతగా, దర్శకుడుగా వెలిగిన త్రివిక్రమ్ కు టైమ్ బాగోలేదనిపిస్తోంది.
టైమ్ బాగోపోతే రకరకాల సమస్యలు వస్తూంటాయని సినిమావాళ్ళ నమ్ముతూంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే ప్రముఖ రచయతగా, దర్శకుడుగా వెలిగిన త్రివిక్రమ్ కు టైమ్ బాగోలేదనిపిస్తోంది. లేకపోతే తీసుకున్న అడ్వాన్స్ త్రివిక్రమ్ వెనక్కి ఇవ్వాలనుకోవటం ఏమిటి...దాన్ని వడ్డీతో కలిపి ఇవ్వమని నిర్మాతలు అడగటమేమిటి. అసలు ఏం జరిగిందో చూద్దాం...
ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...త్రివిక్రమ్ ఓ సినిమా చేయటం నిమిత్తం గతంలో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి నాలుగు కోట్లు అడ్వాన్స్ అందుకున్నారు. ఇండస్ట్రీలో పెద్ద హీరోలను, డైరక్టర్స్ ను అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేయటం మామాలే. కాబట్టి ఇందులో కొత్తేమీ లేదు. అయితే ఇప్పుడు వాళ్లు త్రివిక్రమ్ ని సినిమా చెయ్యమని అడుగుతున్నారు. అల్లు అర్జున్ తో ఆయన చేయబోయే ప్రాజెక్టుని తమ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ బయిట బ్యానర్స్ లో సినిమా చేయటం లేదు. హారిక హాసిని క్రియేషన్స్ తోనే ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తను లేటెస్ట్ గా చేయబోయే సినిమా సైతం అదే బ్యానర్ లో చేద్దామనేదే నిర్ణయం. కానీ ముందు ఒప్పుకున్న కమిట్మెంట్స్ ప్రకారం మైత్రీకు చేయాలి. దాంతో అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేద్దామని నిర్ణయించుకుని, తన ప్రొడ్యూసర్ రాధాకృష్ణ చేత నాలుగు కోట్లు ఇప్పించటానికి ఒప్పించారు.
కానీ మైత్రీ మూవీస్ వాళ్ళు..మేము మీకు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంది సినిమా చేద్దామని కానీ..అడ్వాన్స్ వెనక్కి తీసుకునేందుకు కాదు కదా...అంతగా మీరు మాతో చేయలేమని ఫిక్స్ అయితే వడ్డితో సహా పే చేయండి అని కబురెట్టారట. అడ్వాన్స్ లకు వడ్డీలు ఇవ్వరు కానీ ..ఇప్పుడున్న పరిస్దితి కమిట్మెంట్ తో కూడింది కాబట్టి త్రివిక్రమ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలంటోంది ఇండస్ట్రీ.