1995లో వచ్చిన రంగీలా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్ లో సుస్దిర స్దానం ఏర్పాటు చేసిన సినిమాల్లో ఇది ఒకటి. 

 1995లో వచ్చిన రంగీలా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్ లో సుస్దిర స్దానం ఏర్పాటు చేసిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమాతో ఊర్మిళ పెద్ద స్టార్ అయ్యిపోయింది. అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరో ఉన్నా ఈ సినిమాలో ఊర్మలే హైలెట్ అయ్యింది. ఆమె హాట్ ఫెరఫార్మెన్స్ కు బాలీవుడ్ దాసోహం అనేసింది. అలాంటి రంగీళా సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ ఉందా అంటే రామ్ గోపాల్ వర్మ అవును అంటారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత కొద్ది రోజులుగా ఆయన రంగీళా సినిమాను ఈ కాలానికి తగినట్లు మార్చి సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన తన రైటర్స్ తో డిస్కస్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మరి ఈ సారి ఊర్మిళలా నటించేది ఎవరు..ఆ రంగీళా ఎవరు అనేది మొదట ప్రశ్న. ఆ రంగీళా మరెవరో కాదు...నిధి అగర్వాల్ అని చెప్తున్నారు. 

రామ్ గోపాల్ వర్మ చిత్రాల్లో తనకు రంగీళా ఇష్టమని చెప్పిన ఆమెతోనే వర్మ ఆ సీక్వెల్ సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం నిధి అగర్వాల్ ...పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అయ్యింది. రామ్, పూరి కెరీర్ లు ఈ సినిమా హిట్ పై ఆధారపడి ఉన్నాయనటంలో సందేహం లేదు.