Asianet News TeluguAsianet News Telugu

కోర్టు మెట్లెక్కిన పూజా హెగ్డే.. ఉత్కంఠ రేపుతున్న అఖిల్ 4వ చిత్రం!

అక్కినేని వారసుడిగా సినీ రంగం ప్రవేశం చేసిన అఖిల్ తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అక్కినేని ఫ్యాన్స్ లో అఖిల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అఖిల్ కు స్టార్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. కానీ మూడు చిత్రాలుగా అతడితో విజయం దోబూచులాడుతోంది. 

Interesting details about Akhil 4 movie
Author
Hyderabad, First Published Oct 2, 2019, 2:39 PM IST

అఖిల్ నటించిన ఫస్ట్ మూవీ అఖిల్. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా అంచనాలు అందుకోలేకపోయాయి. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. గీతాఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఎంచుకోగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. అఖిల్ కన్నా మూడేళ్లు పెద్దదైన పూజా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండడంతో అభిమానులు ఈ చిత్రం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు 

తాజాగా సినిమాపై ఉత్కంఠని పెంచే మరో అంశం బయటకు వచింది. బొమ్మరిల్లు భాస్కర్ ప్రస్తుతం అఖిల్, పూజా హెగ్డేలపై కోర్టు సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాడట. సినిమాలో అత్యంత కీలకమైన ఈ ఎపిసోడ్ ఆసక్తిని రేపుతోంది. ఇతర నటీనటులు కూడా ఈ సన్నివేశం షూటింగ్ లో పాల్గొంటున్నారు. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios