‘బింబిసార’పై స్పందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కళ్యాణ్ రామ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్..
ఫాంటసీ, టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ‘బింబిసార’తో నందమూరి కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేశాడు. ఈ చిత్రంపై ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించారు.
పక్కా హిట్ ఫార్మూలాతో నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన ప్రయోగమే ‘బింబిసార’(Bimbisara). ఈ చిత్రంలో Kalyan Ram 500 సంవత్సరం నాటి మహా చక్రవర్తి బింబిసారుడు పాత్రలో నటించారు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫాంటసీ, టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఇటు ఇండస్ట్రీలోని సెలబ్స్ నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ పై తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా స్పందించారు. కళ్యాణ్ రామ్ మరియు చిత్ర యూనిట్ ను పొగుడుతూ ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్ స్పందిస్తూ.. Bimbisara మూవీ టీమ్కు నా అభినందనలు. చాలా ఆసక్తికరమైన మరియు ఆకర్షణీయమైన ఫాంటసీ చిత్రాన్ని అందించారు. చిత్రం ఇండస్ట్రీలో ప్రభావవంతమైన ఉనికిని చాటుకుంది. నందమూరి కల్యాణ్
ఎప్పుడూ కొత్త టాలెంట్ని ఇండస్ట్రీలోకి తీసుకువస్తూ, కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుండటం ప్రశంసనీయం. దీంతో ఆయనంటే నాకు గౌరవం ఏర్పడింది. అలాగే డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ తన మార్క్ ను చూపించారు. టెక్నీషియన్స్, ఆర్టిస్టులందరూ చక్కగా నటించడం అభినందనీయం. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణీకి ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని వయస్సుల వారు సినిమాను తిలకించేలా తెరకెక్కించడం సంతోషకరంగా ఉందంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
రెండు రోజుల కింద థియేటర్లలోకి వచ్చిన ‘బింబిసార’ చిత్రం థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. కళ్యాణ్ రామ్ నటన, గ్రేట్ విజువల్స్, అదిరిపోయే స్క్రీన్ ప్లేకు ప్రశంసలు అందుతున్నాయి. కొత్త దర్శకుడు వశిష్ట సినిమాను హ్యాండిల్ చేసిన తీరుకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. బాక్సాఫీసు వద్ద కూడా ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు నివేదికలు తెలుపుతున్నాయి. వరుస పరాజయాల్లో ఉన్న కళ్యాణ్ రామ్ పంథాని మార్చిన చిత్రంగా ‘బింబిసార’ను చెబుతున్నారు.
చిత్రంలో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించారు. డ్యూయల్ యాక్షన్ తో ఆకట్టుకున్నారు. హీరోయిన్లుగా గ్లామర్ బ్యూటీలు కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్త మీనన్ నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రానికి హరిక్రిష్ణ కే నిర్మాతగా వ్యవహిరించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, కమెడియన్స్ వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర కీలక పాత్రలో నటించారు. ఎంఎం కీరవాణీ అద్భుతమై బీజీఎం, సంగీతం అందించారు.