హీరో విక్రమ్‌ కి గుండె పోటు అనే వార్త అందరిని కలవరానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆసుపత్రి వైద్యులు ఆయన హెల్త్ బుల్లెటిన్ విడుదల చేసింది. 

హీరో విక్రమ్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన హార్ట్ ఎటాక్‌ రావడంతో శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంపై అంతా ఆందోళన చెందారు. సడెన్‌గా విక్రమ్‌ ఇలా ఆసుపత్రి పాలు కావడం, అదికూడా గుండెపోటుతో ఆసుపత్రిలు చేరడం అందరిని షాక్‌కి గురి చేసింది. అభిమానులు,సినీ వర్గాలు సైతం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తాజాగా కావేరి ఆసుపత్రి వైద్య బృందం విక్రమ్‌ హెల్త్ పై మెడికల్‌ బుల్లెటిన్‌ విడుదల చేసింది. 

ఈ సాయంత్రం ఆసుపత్రి వైద్యులు విక్రమ్‌ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. `విక్రమ్‌ ఈరోజులు చెస్ట్ పెయిన్‌తో ఆసుపత్రిలో చేరారు. అనుభవం ఉన్న ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతం విక్రమ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయనకు జస్ట్ చెస్ట్ లో పెయిన్‌ వచ్చింది. కానీ అది హార్ట్ ఎటాక్‌ కాదు. విక్రమ్‌ ఆరోగ్యం బాగుంది. త్వరలోనే ఆయన్ని డిశ్చార్జి చేస్తాం` అని ఓ బుల్లెటిన్‌ విడుదల చేసింది. 

Scroll to load tweet…

దీంతో విక్రమ్‌ అభిమానులు, కోలీవుడ్‌ సినీ వర్గాలు రిలాక్స్ అయ్యారు. వైద్యుల బుల్లెటిన్‌తో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎప్పుడూ వర్కౌట్స్‌ చేస్తూ హెల్దీగా ఉంటారు విక్రమ్‌. ఎంతో ఎనర్జీగానూ ఉంటారు. అలాంటిది విక్రమ్‌కి గుండెపోటు అనే వార్త సర్వత్రా ఆందోళనకి గురి చేసిన విషయం తెలిసిందే. తాజా ఆసుపత్రి వర్గాల ప్రకటనతో అంతా రిలాక్స్ అయ్యారు. ఇక ఈ సాయంత్రమే విక్రమ్‌ నటించిన మణిరత్నం `పొన్నియిన్‌ సెల్వన్‌ 1` టీజర్‌ విడుదలైంది. విజువల్‌ వండర్‌గా ఉన్న టీజర్‌ కనువిందు చేస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో విక్రమ్ తో పాటు కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.