Asianet News TeluguAsianet News Telugu

రష్మి చెప్పేవరకు నాకు ఆ విషయం తెలియదు.. 'అంతకుమించి' హీరో!

'అంతకుమించి' సినిమాకు సంబంధించి తనకు యాభై లక్షల రూపాయలు హీరో సతీష్ జాయ్ ఇవ్వాల్సి ఉందని నిర్మాత గౌరీశంకర్ ప్రసాద్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

hero satish joy response on anthaku minchi controversy
Author
Hyderabad, First Published Aug 25, 2018, 2:42 PM IST

'అంతకుమించి' సినిమాకు సంబంధించి తనకు యాభై లక్షల రూపాయలు హీరో సతీష్ జాయ్ ఇవ్వాల్సి ఉందని నిర్మాత గౌరీశంకర్ ప్రసాద్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా చిత్రబృందం దాన్ని పట్టించుకోకుండా.. సినిమా విడుదల చేశారని గౌరీశంకర్ అన్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన హీరో సతీష్ జాయ్ ఈ విషయంలో నిజం లేదని తేల్చి చెప్పారు.

ఈ సినిమాపై రూ.50 లక్షలు పెట్టారనే విషయంలో కూడా నిజం లేదని అన్నారు. ''నాకు గౌరీశంకర్ చేస్తోన్న ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదు. కన్నా, భాను, సతీష్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ సినిమాఫై పెట్టుబడి పెట్టారు. గౌరీశంకర్ ఈ సినిమాను ఏడాది క్రితమే ఆ ముగ్గురికి రాసిచ్చేశారు. ఏడాది తరువాత సినిమాను పూర్తి చేసి ఈ నెల 24న విడుదల చేశాను. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందనే విషయం నాకు సినిమా విడుదలకు ముందు రోజు వరకు తెలియదు.

స్టే ఆర్డర్ రావాలంటే ముందుగా నాకే రావాలి. కానీ నాకు రాలేదు. మా సినిమా హీరోయిన్ రష్మి నాకు ఫోన్ చేసి చెప్పేవరకు నాకు ఆ విషయం తెలియదు. మనం ఎవరికైనా బాకీ ఉన్నామంటే.. రోజూ ఫోన్లు చేసి అడుగుతూనే ఉంటారు కదా.. కానీ ఆయన నాకు ఈ ఏడాదిలో ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మా సినిమాకు హైప్ రావడంతో కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఆయన డబ్బులిచ్చినట్లు ఆధారాలు ఉంటే తీసుకురమ్మనండి'' అని అన్నారు.  

ఇది కూడా చదవండి.. 

రష్మి సినిమాపై పోలీస్ కేసు!

Follow Us:
Download App:
  • android
  • ios