అది నాకు తెలియని సబ్జెక్టు... పొలిటికల్ ఎంట్రీ పై నరేష్ కామెంట్!
అల్లరి నరేష్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటూ కథనాలు వెలువడుతుండగా ఆయన స్పందించారు. రాజకీయ ప్రవేశంపై తన అభిప్రాయం తెలియజేశారు. అల్లరి నరేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అల్లరి నరేష్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పటి గ్యారంటీ చిత్రాల హీరో సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం తహతహలాడుతున్నారు. తన కామెడీ ఫార్ములా ఫేడ్ అవుట్ అయిపోగా విజయం సాధించే మార్గం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో కొంచెం సీరియస్ సబ్జక్ట్స్ ట్రై చేస్తున్నారు. గత ఏడాది బంగారు బుల్లోడు, నాంది చిత్రాలతో అల్లరి నరేష్ ప్రేక్షకులను పలకరించారు. బంగారు బుల్లోడు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. నాంది మాత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు.
మరోసారి ఆయన సోషల్ బర్నింగ్ టాపిక్ ఎంచుకున్నారు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. నవంబర్ 25న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్ర ప్రమోషన్స్ లో అల్లరి నరేష్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రచారం అవుతున్న ఒక గాసిప్ కి ఆయన సమాధానం చెప్పారు. అల్లరి నరేష్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు.
రాజకీయాలు నాకు తెలియని సబ్జెక్టు. కాబట్టి నేను పాలిటిక్స్ లోకి వెళ్లడం జరగని పని. అయితే డైరెక్షన్ చేయాలనేది నా కోరిక. భవిష్యత్ లో డైరెక్షన్ ఖచ్చితంగా చేస్తాను. రాజకీయాలకు దూరంగా ఉంటాను, అని అల్లరి నరేష్ కుండబద్దలు కొట్టారు. ఇక మరికొన్ని గంటల్లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ విడుదల కానుంది. మరి నరేష్ కి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.