వరుస అపజయాలతో సతమతమవుతున్న యాక్షన్ హీరో గోపీచంద్ ఎలాగైనా ఈ సారి మంచి సక్సెస్ లు అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే సైరా సినిమాతో పోటీ పడేందుకు చాణక్య సినిమాతో సిద్దమైన గోపీచంద్ మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.
గత కొన్నాళ్లుగా వరుస అపజయాలతో సతమతమవుతున్న యాక్షన్ హీరో గోపీచంద్ ఎలాగైనా ఈ సారి మంచి సక్సెస్ లు అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే సైరా సినిమాతో పోటీ పడేందుకు చాణక్య సినిమాతో సిద్దమైన గోపీచంద్ మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. రీసెంట్ గా బివిఎస్ ప్రసాద్ నిర్మాతగా ఓ కొత్త ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసిన గోపి ఇప్పుడు మరో కొత్త సినిమాను అదే తరహాలో స్టార్ట్ చేశాడు.
సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథలో నటిస్తున్నట్లు ఇటీవల ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రోజు సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, తమన్నా - గోపీచంద్ ఫ్రెమ్ లో ఉండగా మొదటి షాట్ కి క్లాప్ కొట్టారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టనున్నారు.
ఇక గోపీచంద్ సరసన మొదటిసారి తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఇదివరకే ఈ బేబి దర్శకుడితో రచ్చ - బెంగాల్ టైగర్ సినిమాల్లో నటించింది. ఇక గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్ లో గౌతమ్ నంద చేశాడు. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. మరి ఈసారైనా సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి. ఇక గోపీచంద్ చాణక్య సినిమా ఈ నెల 5న విడుదల కానుంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 3, 2019, 11:27 AM IST