సమంత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. `యశోద` నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్
సమంత అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుంది. ఆమె నటించిన `యశోద` సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ ఇచ్చేందుకు సిద్ధమైంది యూనిట్.
సమంత ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో `యశోద` ఒకటి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రమిది. దర్శక ద్వయం హరి-హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. చాలా రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇది వరకే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. జులై, ఆగస్ట్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో డిలే అవుతూ వస్తోంది. ఆ మధ్య ఓగ్లింప్స్ విడుదల చేశారు. అది సినిమాపై అంచనాలను పెంచింది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో సడెన్గా సర్ప్రైజ్ రెడీ చేసింది యూనిట్. సమంత అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్ డేట్ ఇవ్వబోతుందట. తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. థ్రిల్ కోసం రెడీగా ఉండండి అని నిర్మాణ సంస్థ తెలిపింది. రేపు ఎగ్జైటింగ్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్టు తెలిపింది. అయితే వినాయక చవితి సందర్భంగా బుధవారం ఈ చిత్ర రిలీజ్ డేట్ని ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే సినిమా నుంచి మరో వీడియో గానీ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి సమంత నుంచి అభిమానులకు మంచి గుడ్ న్యూస్ రాబోతుందని చెప్పొచ్చు.
సమంత తెలుగులో చివరగా `జాను` చిత్రంలో నటించింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇటీవల తమిళంలో నటించిన `కాతు వాకుల రెండు కాదల్` చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేశారు. కానీ అది పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సమంత సినిమా కోసం ఆమె అభిమానులే కాదు సాధారణ ఆడియెన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.