ఏజ్ పెరుగుతున్నా కొద్ది అవకాశాలో పాటు. రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ వస్తోంది నయనతార (Nayantara). అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్న సీనియర్ హీరోయిన్.. మెగా మూవీ షెడ్యూల్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు.

ఏజ్ పెరుగుతున్నా కొద్ది అవకాశాలో పాటు.. రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ వస్తోంది నయనతార (Nayantara). అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్న సీనియర్ హీరోయిన్.. మెగా మూవీ షెడ్యూల్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు.

కోలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది లేడీ సూపర్ స్టార్ నయన తార ((Nayantara) వరుస సినిమాలతో నయనతార(Nayantara) ఫుల్ బిజీగా అయిపోయింది. ప్రియుడు విఘ్నేశ్ శివన్ తో కలిసి సొంత బ్యానర్లో సినిమాలను కూడా వరుసగా నిర్మిస్తోంది. అటు నిర్మాతగా కూడా పుంజుకుని బిజీ బిజీ అయిపోయింది. అయితే తెలుగులో మాత్రం కోన్ని సినిమాలను మాత్రమే ఎంచుకుని చేస్తుంది నయన తార (Nayantara). తప్పదు అనుకుని.. తనకు నచ్చితే తప్ప సినిమాలు చేయడం లేదు.

 ఈ నేపథ్యంలో తెలుగు నుంచి కొన్ని సినిమాలు వెళ్లినా Nayantara సున్నితంగా తిరస్కరించింది. కానీ చిరంజీవి(Chiranjeevi) గాడ్ ఫాదర్ లో చేయడానికి మాత్రం సై అంది. ఇక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటూనే ఉంది. కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా,పెద్దగా గ్యాప్ తీసుకోకుండా చకచకా నిర్మాణాన్ని జరుపుకుంటోంది.

ఇక ఈ మూవీ షూటింగ్ లో రీసెంట్ గానే జాయిన్ అయ్యారు నయనతార (Nayantara). ఆమె పాల్గొనగా ఒక కీలకమైన షెడ్యూల్ ను పూర్తిచేశామని డైరెక్టర్ మోహన్ రాజా ట్వీట్ చేశాడు. ఆమెతో కలిసి మూడోసారి వర్క్ చేయడం తనకి ఆనందంగా ఉందని ఆయన ట్విట్టర్ లో సంతోషం వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో నయనతారతో దిగిన ఒక ఫొటోను ఆయన షేర్ చేశాడు.

Scroll to load tweet…

 

ఇంతకుముందు నయనతార(Nayantara)తో మోహన్ రాజా తని ఒరువన్, వేలైక్కారన్ సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు కూడా కోలీవుడ్ లో భారీ విజయాలను సాధించాయి. ఇక గాడ్ ఫాదర్  విషయానికి వస్తే. మేజర్ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈమధ్యే కోవిడ్ బారిన పడి కోలుకున్న మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. గాడ్ ఫాదర్ సెట్ లో అడుగు కూడా పెట్టారు.