అక్షయ్ కుమార్ సినిమా సెట్లో అగ్నిప్రమాదం..
సినిమా షూటింగ్ జరుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట. అక్షయ్ కుమార్, కృతి సనన్లపై కొన్ని సీన్లు తెరకెకిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని బాలీవుడ్ మీడియా కథనం ద్వారా తెలుస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumer) నటిస్తున్న `బచ్చన్ పాండే`(Bachchan Pandey) సినిమా షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ జరుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట. అక్షయ్ కుమార్, కృతి సనన్లపై కొన్ని సీన్లు తెరకెకిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని బాలీవుడ్ మీడియా కథనం ద్వారా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రాణహానీ లేదని, ఎవరికీ ఏం కాలేదని, అంతా సురక్షితంగానే ఉన్నారట.
ప్రస్తుతం బాలీవుడ్లో Akshay Kumer నటిస్తున్న చిత్రాల్లో `బచ్చన్ పాండే` ఒకటి. ఆయనకు జోడీగా కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తమిళంలో వచ్చిన `జిగార్తాండ`కి రీమేక్ అని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులవుతుంది. మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా షూటింగ్లు అన్ని నిలిచిపోతున్నాయి. సినిమా విడుదలలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమాలో కొంత ప్యాచ్ వర్క్ మిగిలిందట. దాన్ని కంప్లీట్ చేయాలని భావించారు.
అందులో భాగంగా సెట్లో అక్షయ్, కృతిసనన్లపై చిత్రీకరణ జరుపుతున్నారు. అనుకోకుండా సెట్లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన యూనిట్ మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తుంది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు షూటింగ్ని పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ ఏడాది మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ బాలీవుడ్లో దూసుకుపోతున్నారు. కరోనా వల్ల ఆయన సినిమాలకు బ్రేక్ పడ్డాయని చెప్పొచ్చు.
కానీ అంతకు ముందు అక్షయ్ కుమార్ సినిమాల నుంచి ఏడాది వెయ్యి కోట్ల బిజినెస్ జరుగుతుంది. ప్రతి సినిమా హిట్ అనే టాక్ తెచ్చుకునేది. అంతేకాదు ప్రతి సినిమా రెండు వందల నుంచి మూడు వందల కోట్లు వసూలు చేసేవి. ఇలా ఓ రకంగా అక్షయ్ కుమార్ని మినీ ఇండస్ట్రీగా పిలుచుకునే వారు. కరోనా వల్ల ఆయన సినిమాలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. వాటిలో `పృథ్వీరాజ్`, `రక్షాబంధన్`, `మిషన్ సిండ్రెల్లా`, `బచ్చన్ పాండే` చిత్రాలున్నాయి.
వీటితోపాటు అక్షయ్ `రామ్సేతు`, `ఓమైగాడ్2` చిత్రాలు చేస్తున్నారు. రీసెంట్గా `సెల్ఫీ` అనే సినిమాకి కమిట్ అయ్యారు. రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అరున భాటియా, యశ్ జోహార్, సుప్రియ మీనన్, కరణ్ జోహార్, పృథ్వీరాజ్ సుకుమారన్, అపూర్వ మెహతా, లిస్టిన్ స్టెఫెన్ నిర్మిస్తున్నారు.