వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ఎఫ్-3. సక్సెస్ ఫుల్ గా 50 డేస్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేయనుంది. అంతే కాదు ఆడియన్స్ కు డబుల్ బోనాంజా ఇవ్వబోతున్నారు.
సీనియర్ హీరో వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మూవీ ఎఫ్3. 2019లో వచ్చిన ఎఫ్-2కు సీక్వెల్గా తెరకెక్కిన ఈసినిమా . భారీ అంచనాల నడుమ మే 27న రిలీజ్ అయ్యింది. ఎఫ్2 కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం క్వెల్కు ఏ మాత్రం తీసిపోకుండా.. రెట్టింపు ఎంటర్టైనమెంట్తో ఎఫ్3 ని తెరకెక్కించారు టీమ్. కామెడీ డోస్ ను పెంచి అద్భుతంగా తెరకెక్కించారు సినిమాను
ఇక వెంకటేష్ వరుణ్ తేజ్ ల మధ్య కామెడీ టైమింగ్కు ఆడియన్స్ పిదా అయ్యారు. ఇక అనిల్ రావిపూడి చేసిన ప్రయత్నం బాగుంది. కాని థియేటర్లలో కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఎఫ్ 2 సాధించిన కలెక్షన్స్ నుసాధించలేకపోయింది. ఆడియన్స్ రెండున్నర గంటలు హాయిగా నవ్వుకునేలా చేశాడు. కానీ పోటీగా మరికొన్ని సినిమాలు రావడం. ఆసినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో ఎఫ్3 మూవీ బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది.
థియోటర్లలో సందడి చేసిన ఈసినిమా ఇక నుంచి ఓటీటీలో హడావిడిచేయబోతుంది. ఆడియన్స్ కు డబుల్ బోనాంజ ప్లాన్ చేశారు మూవీ టీమ్. ఎఫ్3 మూవీ ఓటీటీలో నిన్న రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అయ్యింది ఎఫ్-3. నెట్ఫ్లిక్స్, సోనిలివ్ రెండు డిజిటల్ ప్లాట్ఫార్మ్లలో గత రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన 50రోజుల తర్వాత ఓటీటీలో విడుదలైంది. ఈ మధ్య కాలంలో సినిమాలన్ని దాదాపుగా నెలలోపే ఓటీటీలలో దర్శనమిస్తున్నాయి. కాగా ఈ చిత్రం దాదాపు 8 వారాల తర్వాత డిజిటల్లోకి రావడం విశేషం
ఈ సినిమా 50 రోజులు తరువాతనే ఓటీటీలో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ముందే చెప్పారు. చెప్పినట్టు గ్యాప్ తీసుకుని డిజిటల్ స్ట్రీమింగ్ చేశారు టీమ్. ఇక శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్లు ఎఫ్3 మూవీని నిర్మించారు. తమన్నా, మెహరిన్లు హీరోయిన్లుగా నటించిన ఈసినిమాలో సునీల్, సోనాల్చౌహన్లు కీలకపాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.