Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ చిత్రానికి 30 కోట్ల సెట్.. ప్రత్యేకత ఏంటో తెలుసా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Erecting huge sets on the outskirts of Hyderabad for Prabhas movie
Author
Hyderabad, First Published May 17, 2019, 10:11 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తదుపరి చిత్రం రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమైంది. పూజా హెగ్డే హీరోయిన్. 

ప్రభాస్ ఇకపై తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసేలా లేడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఇండియా వ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. దీనితో ప్రభాస్ తో సినిమాలు చేయాలనుకునే దర్శకులు భారీ స్థాయిలో ఉండే కథల్నే సిద్ధం చేస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

హైదరాబాద్ నగర శివారులో ఈ చిత్రం కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈ సెట్ కోసం నిర్మాతలు దాదాపు 30 కోట్ల రూపాయలు వెచ్చిస్తునట్లు సమాచారం. కేవలం ఒక్క సెట్ కోసమే ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారంటే అందులో ఏదో ఒక విశేషం ఉండాలి. 1960 కాలం నాటి పరిస్థితుల్లో యూరప్ లో ఎక్కువభాగం ఈ చిత్రం ఉంటుంది. ముందుగా ఫారెన్ లొకేషన్స్ లో షూటింగ్ చేద్దామని భావించారు. ఫారెన్ లోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ భారీ ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల హైదరాబాద్ లోనే అవసరమైన సెట్ నిర్మించుకుని అందులో షూటింగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 

విదేశాల్లో ఉన్నట్లు ఫీలింగ్ కలిగే అద్భుతమైన ఈ సెట్ పై ఆర్ట్ డైరెక్టర్స్, ఇతర సిబ్బంది వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం సాహో షూటింగ్ చివరి దశలో ఉంది. సాహో షూటింగ్ పూర్తి కాగానే రాధాకృష్ణ దర్శకత్వంలోని చిత్ర షూటింగ్ ఏకధాటిగా జరగనుంది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios