Asianet News TeluguAsianet News Telugu

'దూకుడు' రీరిలీజ్.. నిమిషాల్లో ఆన్లైన్ లో టికెట్లు అమ్ముడిపోయాయి!

మహేష్ బాబు సొంత మల్టీప్లెక్స్ 'ఏఎంబీ సినిమాస్'లో శుక్రవారం 'దూకుడు' స్పెషల్ షో వేస్తున్నారు. దీని కోసం ఆన్ లైన్లో టికెట్లు ఇలా పెట్టారో లేదో.. అలా ఫుల్ అయిపోయాయి. 
 

Dookudu Re-Release: Tickets Sold Out!
Author
Hyderabad, First Published Aug 7, 2019, 3:16 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'దూకుడు' సినిమా రిలీజై తొమ్మిదేళ్లు కావొస్తుంది. మహేష్ కెరీర్ లో ఈ సినిమా మైలురాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా మళ్లీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 9న మహేష్ బాబు పుట్టినరోజు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహేష్ బాబు సొంత మల్టీప్లెక్స్ 'ఏఎంబీ సినిమాస్' లో శుక్రవారం నాడు 'దూకుడు' సినిమా స్పెషల్ షో వేస్తున్నారు. దీనికోసం ఆన్లైన్ లో టికెట్స్ పెట్టిన వెంటనే నిమిషాల్లో అన్నీ అమ్ముడయిపోయాయి.

టీవీలో ఇప్పటికే ఎన్నో సార్లు ఈ సినిమాను ప్రసారం చేసినా.. మళ్లీ థియేటర్ లో సినిమా చూడడానికి అభిమానులు ఇంత ఉత్సాహం చూపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో మైల్ స్టోన్ సినిమాని ఆయన సొంత థియేటర్ లో చూడడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు అభిమానులు. ఈ షోకి గనుక మంచి రెస్పాన్స్ వస్తే మరో రెండు, మూడు షోలు వేసినా ఆశ్చర్యపడక్కర్లేదు.

కేవలం ఏఎంబీ సినిమాస్ లో మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు. విజయవాడలో ఓ థియేటర్ లో అయితే వారం రోజుల ముందు నుండే బర్త్ డే వీక్ అంటూ రోజుకొక మహేష్ బాబు సినిమాను ప్రదర్శిస్తున్నారు. అక్కడ కూడా ఆగస్ట్ 9నే 'దూకుడు' సినిమాను ప్రదర్శించనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios