ఇటీవల దివ్య అగర్వాల్‌ తండ్రి కరోనాతో మృతి చెందారు. ఆయన చనిపోయి వారం రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ అప్పుడే హాట్‌ ఫోటోలతో రెచ్చిపోయింది దివ్య. ఓ మేగజీన్‌ని గ్లామర్‌ పోజులిస్తూ కనిపించింది. అంతేకాదు వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. 

హిందీ టీవీ నటి దివ్య అగర్వాల్‌ ట్రోల్‌కి గురయ్యింది. నెటిజన్లకి కోపానికి గురయ్యింది. అంతిమంగా వారి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. మరి దివ్య అగర్వాల్‌ ఇలా బలవడానికి కారణాలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. 

హిందీలో టీవీ నటిగా దివ్య అగర్వాల్‌ మంచి పేరుతెచ్చుకున్నారు. `ఎంటీవీ స్ప్లైట్‌విల్లా`, `ఎంటీవీ ఏస్‌ ఆఫ్‌ స్పేస్‌`లో విన్నర్‌గా నిలిచారు. `రాగిని ఎంఎంఎస్‌ః రిటర్న్స్ ` వెబ్‌ సిరీస్‌లో మెరిసి పాపులర్‌ అయ్యారు. మరోవైపు మ్యూజిక్‌ వీడియోలతోనూ అలరిస్తుంది. అంతేకాదు గతేడాది టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ టాప్‌ 20 లిస్ట్ లో స్థానం సంపాదించింది. దీంతోపాటు తన గ్లామర్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అలరిస్తుంటుంది. 

View post on Instagram

ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇటీవల ఆమె తండ్రి కరోనాతో మృతి చెందారు. ఆయన చనిపోయి వారం రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ అప్పుడే హాట్‌ ఫోటోలతో రెచ్చిపోయింది. ఓ మేగజీన్‌ని గ్లామర్‌ పోజులిస్తూ కనిపించింది. అంతేకాదు వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. తండ్రి మరణించిన వారం రోజుల్లో సోషల్‌ మీడియాలో గ్లామరస్‌ ఫోటోలను షేర్‌ చేసి ట్రోల్స్ కి గురయ్యింది. అప్పటి నుంచి నెటిజన్లు దివ్య తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

View post on Instagram

తండ్రి చనిపోయాడన్న బాధ కొంచెం కూడా లేకుండా ఎలా ఉండగలుగుతున్నావంటూ ఆమెని ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై దివ్య అగర్వాల్‌ సైతం ఘాటుగానే స్పందించారు. ప్రస్తుత సమాజం కేవలం ఎదుటి వాళ్ల బాధనే కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది. జీవితంలో మూవ్‌ ఆన్‌ అయి మళ్ళీ సాధారణ జీవితం గడిపితే జనాలు చూడలేకపోతున్నారేమో అని సమాధానం చెప్పింది. దీంతో అగ్గిమీద మరింత ఉప్పు చల్లినట్టయ్యింది. 

View post on Instagram
View post on Instagram