చిన్నప్పుడు రాజశేఖర్ ను ఇమిటేట్ చేసేవాడిని, ఆయన వల్లే ఫేమస్ అయ్య : డైరెక్టర్ సుకుమార్
నేను ఫేమస్ అయ్యాను అంటే కారణం రాజశేఖర్ గారే అని షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్. ఇంతకీ హీరో రాజశేఖర్ వల్ల సుకుమార్ ఎలా ఫేమస్ అయ్యారు.
రాజశేఖర్ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్ హీరోయిన్లుగా శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా శేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చారు డైరెక్టర్ సుకుమార్. ఈ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సుకుమర్. హీరో రాజశేఖర్ వల్ల తాను ఫేమస్ అయ్యానంటూ షాకింగ్ విషయాలు చెప్పారు సుకుమార్. సకుమార్ మాట్లాడుతూ. నా స్నేహితుడు కృష్ణ అని మా ఊరిలో ఉండేవాడు. అతను ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు.మా ఊర్లో అందర్నీ ఇమిటేట్ చేస్తుంటే నేను అసూయపడేవాణ్ణి. నేను కూడా అలా చేయాలి అని అనుకున్న ఫస్ట్ ట్రై చేసింది హీరో రాజశేఖర్గారిని. అలా చేసి మా ఊరిలో బాగా ఫేమస్ అయ్యాను అన్నారు సుకుమార్ దాంతో తనను స్కూల్లో నన్ను రాజశేఖర్గారిలా చేయమని అడిగేవారట అందరూ.
సుకుమర్ ఈ మట అనగానే అంతా ఆశ్చర్య పోయారు. శేఖర్ ప్రీరిలీజ్ లో సుకుమార్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది శేఖర్ మూవీ. ఇక ఈ ప్రిరిలీజ్ లో సుకుమర్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు., రాజశేఖర్గారు చేసిన ఆహుతి, ఆగ్రహం, తలంబ్రాలు, మగాడు, అంకుశం ఇలాంటి సూపర్డూపర్ సినిమాలు మమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి.. ఆ టైమ్లో ఆయనకు వీరాభిమాని అయ్యాను. సినిమాల్లోకి రాగలను, ఏదైనా చేయగలను అనే ఆలోచన నాలో ఏర్పడటానికి ఆయనే కారణం అన్నారు సుకుమార్.
సుకుమార్ మాట్లాడుతూ... ఆయనలోని గొప్ప విషయం ఏంటంటే.. మనందరం సినిమా పరిశ్రమలో ఉంటూ డబ్బులు, పేరు సంపాదిస్తూ మన పిల్లల్ని, కుటుంబాన్ని మాత్రం ఇండస్ట్రీకి దూరం పెడుతుంటాం. కానీ ఆయన ఇద్దరమ్మాయిలను ఇండస్ట్రీకి తీసుకొచ్చినందుకు హ్యాట్సాఫ్. ఈరకంగా ఇండస్ట్రీ ఒక పవిత్రమైన ప్రదేశం అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఒక డైరెక్టర్కి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది జీవితగారు అటు ఫ్యామిలీని చూసుకుంటూ, ఇటు భర్తని హీరోగా పెట్టి ఓ సినిమాకి దర్శకత్వం చేస్తూ భారాన్ని మోసినందుకు ఆమెకు నమస్కారాలు అన్నారు సకుమార్... జీవితగారి కోసమైనా శేఖర్ బ్లాక్బస్టర్ కావాలి అన్నారు జీనియస్ డైరెక్టర్ సుకుమార్.
ఇక హీర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. కరోనా వల్ల చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాను. మీ ఆశీర్వాదాలే నన్ను బ్రతికించాయి అన్నారు రాజశేఖర్. అందరూ థియేటర్ కు వెళ్ళి సినిమా చూడాలి అన్నారు. శేఖర్ న చూసి నా బ్రతుకు తెరువుని బ్రతికించండంటూ.. వేడుకున్నారు సీనియర్ హీరో. ఈ సినిమా కోసం మా కంటే జీవితనే ఎక్కువ కష్టపడిందన్నారు హీరో. పోస్ట్ ప్రొడక్షన్ లో శివాని, శివాత్మిక సహాయం చేశారన్నారు.