ఆసుపత్రిలో తెలుగు దర్శకురాలు!
దర్శకురాలు సంజనా రెడ్డి అస్వస్థతకు గురై... ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్టు సమాచారం. పాత్రికేయురాలిగా తన ప్రయాణం ప్రారంభించిన సంజన రాజ్ తరుణ్తో `రాజుగాడు` సినిమాతో దర్శకురాలిగా పరిచయమైంది. ఆ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు కరణం మల్లీశ్వరి బయోపిక్ ని తెరపై తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఆమె ఎందుకు హాస్పటిల్ లో చేరిందనే విషయమై క్లారిటీ లేదు.
దర్శకురాలు సంజనా రెడ్డి అస్వస్థతకు గురై.... ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్టు సమాచారం. పాత్రికేయురాలిగా తన ప్రయాణం ప్రారంభించిన సంజన రాజ్ తరుణ్తో `రాజుగాడు` సినిమాతో దర్శకురాలిగా పరిచయమైంది. ఆ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు కరణం మల్లీశ్వరి బయోపిక్ ని తెరపై తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఆమె ఎందుకు హాస్పటిల్ లో చేరిందనే విషయమై క్లారిటీ లేదు.
ఈ విషయమై మీడియావారు కోన వెంకట్ ని సంప్రదిస్తే... “ఆమె కొంతకాలంగా డైట్ లో ఉంది. గత కొద్ది రోజులుగా లిక్విడ్ డైట్ లో ఉంది. దాంతో వీక్ నెస్ కు గురైంది. దాంతో బాగా నిస్త్రాణకు గురై హాస్పటిల్ లో చేరింది తప్ప వేరే ఏమీ లేదు. త్వరలోనే ఆమె డిచ్చార్జ్ అవుతుంది .” అనిచెప్పారు.
ఇక వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మన దేశానికి తొలి మెడల్ తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరిపై సంజన ఓ సినిమా తెరకెక్కించనుంది. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ నిర్మించనున్నారు. శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామం నుంచి దేశానికి తొలి ఒలింపిక్ పతాకాన్ని తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరి కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చిత్రబృందం భావించిందట. సుమారు 50 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట.
ఈ సినిమాలో మల్లేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. మరోవైపు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రారంభమైంది. ఈలోగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. సంజన కోలుకుంటున్నారని, ఈరోజే ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు తెలిపారు.