Asianet News TeluguAsianet News Telugu

సలార్ కాంబినేషన్ రిపీట్... దిల్ రాజు గట్టిగా ప్లాన్ చేశారట!

ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం తరువాత కూడా మరలా ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తారట. దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగిపోయిందన్న టాక్ బయటికి వచ్చింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రభాస్ తో మూవీ చేయడానికి ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్, ప్రభాస్ చిత్రాన్ని ఆయన లాక్ చేశారట. 


 

dil raju plans another pan india movie with prabhas and prashant neel combination ksr
Author
Hyderabad, First Published Mar 23, 2021, 11:54 AM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్ట్స్ ఓకే చేయడమే కాకుండా, ఏక కాలంలో పూర్తి చేసే పనిలో ఉన్నారు. రాధే శ్యామ్ షూటింగ్ చివరి దశకు చేరగా, సలార్, ఆదిపురుష్ చిత్రాల షూటింగ్ ఈమధ్యనే మొదలైంది. ఈ మూడు చిత్రాల అనంతరం ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రంలో నటిస్తాడు. రూ. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 


కాగా ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం తరువాత కూడా మరలా ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తారట. దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగిపోయిందన్న టాక్ బయటికి వచ్చింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రభాస్ తో మూవీ చేయడానికి ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్, ప్రభాస్ చిత్రాన్ని ఆయన లాక్ చేశారట. 


ప్రభాస్, ప్రశాంత్ నీల్ లకు ఈ మేరకు దిల్ రాజు భారీ మొత్తంలో అడ్వాన్సులు కూడా ఇచ్చాడట. 2023లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుండని సమాచారం అందుతుంది. సలార్ మూవీ కోసం ప్రశాంత్ నీల్ తో చేయిగలిపిన ప్రభాస్, ఆయన కమిట్మెంట్, వర్కింగ్ స్టైల్ కి ఇంప్రెస్ అయ్యారట. అందుకే ఆయనతో మరో చిత్రానికి సైన్ చేశాడని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios