‘వి’ రిలీజ్...దిల్ రాజుకు 6 కోట్లు నష్టం?
ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో సెప్టెంబర్ 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డివైడ్ టాక్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా వల్ల అమేజాన్ ప్రైమ్ కు లాభమా,నష్టమా, నిర్మాత దిల్ రాజు ఎంతకు ఈ సినిమాని అమ్మారు అనేది చర్చగా మారింది.
నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’. సుధీర్ బాబు, అదితిరావు హైదరిలతో కలిసి నివేదా థామస్ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో సెప్టెంబర్ 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డివైడ్ టాక్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా వల్ల అమేజాన్ ప్రైమ్ కు లాభమా,నష్టమా, నిర్మాత దిల్ రాజు ఎంతకు ఈ సినిమాని అమ్మారు అనేది చర్చగా మారింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని అమేజాన్ ప్రైమ్ వారు...మొదట్లో 33 కోట్లకు కొందామని ఫిక్స్ అయ్యారట. మే నెలలోనే దిల్ రాజు కు..అమేజాన్ నుంచి ఓటీటీ ఆఫర్ వచ్చింది. కానీ.. అప్పుడు దిల్ రాజు, నానిలు ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. రోజులు గడిచాయి. రిలీజ్ ఇంకా లేటైపోతుంది. థియోటర్స్ రిలీజ్ దాకా ఆగలేం అని అర్దమైంది. దాంతో వేరే దారి లేక ఓటీటికు ఇచ్చేసారు.
అయితే ఈ సారి దిల్ రాజు తనంతట తాను ముందుకు వచ్చి రిలీజ్ చేస్తానని ఓటీటికు చెప్పారు. దాంతో వాళ్లు అంత రేటు ఇవ్వలేమని అన్నారట. అప్పటికే కొన్ని తెలుగు సినిమాలు ఓటీటిలో రిలీజ్ చేసి బొప్పి కట్టాయిని, అందుకే మొదట చెప్పిన రేటు కష్టం అని తేల్చారట. దాంతో మొత్తానికి బేరసారాలు సాగి సాగి చివరకు 27 కోట్ల దగ్గర తెగ్గేసారట. దాంతో దిల్ రాజుకు ఆరు కోట్లు నష్టం వచ్చింది అని ప్రచారం జరుగుతోంది.
నాని ఈ చిత్రంలో పూర్తి నెగటీవ్ షేడ్స్ ఉన్న క్రిమినల్ పాత్రలో కనిపించగా.. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు మెప్పించాడు. వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతమందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు.