టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కుమార్తె హన్షిత రెడ్డి  తన తల్లికి ప్రత్యేకంగా ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య,  హన్షిత తల్లి అనిత కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. తన తల్లి శారీరకంగా ఈ భూమిద  లేకపోయినా, ఆమె స్మృతిని నిలుపుకుంటూ హన్షిత ఇంట్లోనే తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. మదర్స్ డే సందర్భంగా హన్షిత తన తల్లి విగ్రహాన్ని హత్తుకుని దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

ఈ ఫోటోలో హన్షిత తన కూతురు ఇషితా కూడా ఉన్నారు. అంతే కాదు ఈ పోటోలో అనిత తల్లి కూడాఉన్నారు. అంతే హన్షిత అమ్మమ్మ కూడా ఉన్నారు.  తల్లి అనిత విగ్రహాన్ని పట్టుకుని ప్రేమగా నిమురుతున్న ఫోటోను సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసి.. ఈ  ఫోటోకి “నాలుగు తరాలు” అనే క్యాప్షన్ ఇచ్చింది. కుటుంబ భావోద్వేగానికి అద్దంపట్టే ఈ ఫోటోను పలువురు నెటిజన్లు అభినందించారు. 

హన్షిత తల్లి ప్రేమను ఇలా గుర్తుంచుకుంటున్న తీరు చాలా మంది నెటిజన్ల మనసు హత్తుకుంది. ప్రస్తుతం హన్షిత నిర్మాతగా పలు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ పోస్టులు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంటారు. 

మరోవైపు, అనిత మృతిచెందిన తర్వాత నిర్మాత దిల్‌రాజు కొంతకాలం ఒంటరిగా గడిపారు. తరువాత లాక్‌డౌన్ సమయంలో తేజస్వీ తో రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు.