Asianet News TeluguAsianet News Telugu

‘ఆది పురుష్’లో ఆ సన్నివేశాలు బాగొచ్చాయంటా.! బెస్ట్ అవుట్ పుట్ కోసం చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో మూవీపై ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
 

Did those scenes in Aadipurush look good! The film unit pays special attention to the best output
Author
Hyderabad, First Published Jun 29, 2022, 6:37 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నారు. ఒక్కో ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తూ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. పక్కా బ్లాక్ బాస్టర్ టాక్ తో ఆయన సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రభాస్  నటిస్తున్న భారీ చిత్రాల్లో హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి. ఈ మూవీని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నారు. హీరోయిన్ గా  బాలీవుడ్ యంగ్ హీరోయిన్  కృతి సనన్ (Kriti Sanon) నటిస్తోంది.   కృతి సీత పాత్రలో కనిపించనుంది. ఇక ఈ భారీ చిత్రాన్ని టీ-సిరీస్ ఫిల్మ్స్, రెట్రో ఫిల్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. గతేడాది ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఎట్టకేళకు పూర్తైయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 12న  సంక్రాంతి కానుకగా ‘ఆదిపురుష్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం రిలీజ్ కు ఇంకా ఆరు నెలల సమయం ఉండటంతో ప్రేక్షకులకు బెస్ట్ అవుట్ పుట్ ను అందించేందుకు చిత్ర టెక్నికల్ టీం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందంట. మరోవైపు గత వారం ‘ఆదిపురుష్’ ఎంటైర్ కాస్ట్ దర్శకుడు ఓ రౌత్ ఇంటికి చేరినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా స్టార్ కాస్ట్, చిత్ర యూనిట్ అంతా కలిసి ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ ను ఒకసారి పరిశీలించినట్టు టాక్ వినిపిస్తోంది. సినిమాలో ప్రభాస్, కృతి సనన్ మధ్య సాగే కొన్ని సన్నివేశాలు  అద్భుతంగా వచ్చాయంట. మిగితా వర్క్ ను కూడా త్వరగా కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమైంది యూనిట్. 7000 ఏళ్ల కింద జరిగిన రామయాణాన్ని, అయోధ్య రాజు రాఘవ, సీత కోసం లంకకు వెళ్లడం, రావణాసురుడుని అంతమొందించడం వంటి అంశాలనే చిత్రంలో మరింత ఆసక్తిగా చూపించనున్నారు. 

ఇక ఈ చిత్రాన్ని రూ.500 కోట్లతో తెరకెక్కిస్తున్నట్టు గా టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ రామునిగా నటిస్తుండగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా అలరించనుంది. ఇక రామాయణ కథలోని మెయిన్ విలన్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇఫ్పటికే ఆదిపురుష్ కోసం ప్రత్యేకమైన సెట్స్ వేయడం, అద్భుతమైన లోకేషన్స్ లో చిత్రీకరించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.  ఇక ఈ మూవీని తెలుగు, హిందీలో నిర్మిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలు ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios