విద్యావ్యవస్థపై ధనుష్ పోరాటం
ప్రస్తుత విద్యావ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపే విధంగా ఈ కథ ఉంటుందని, ధనుష్ పాత్ర సీరియస్ ఎమోషన్తో సాగబోతోందని చెప్పుకుంటున్నారు.
తమిళ సూపర్ స్టార్ ధనుష్. తెలుగులో నేరుగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందే.... ఆ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిందో.. లేదో మరో సినిమాకి అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో ధనుష్ ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడు. దర్శకుడు వెంకీ అట్లూరి ధనుష్ కోసం ఓ కథ తయారుచేశాడు. ఇటీవల ధనుష్ తో వెంకీ అట్లూరి తో మీటింగ్ జరిగింది. కథ కూడా ఓకే అయిపోయింది.
వెంకీ అట్లూరి ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ ప్రేమకథలే. అయితే.. ధనుష్ కోసం మరో కొత్త కథని ఎంచుకున్నాడని వినపడుతోంది. అయితే ఈసారి అప్పట్లో జెంటిల్మెన్ సినిమాలా...విద్యావ్యవస్థ నేపథ్యంలో కథ సాగబోతోందని తెలుస్తోంది. ప్రస్తుత విద్యావ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపే విధంగా ఈ కథ ఉంటుందని, ధనుష్ పాత్ర సీరియస్ ఎమోషన్తో సాగబోతోందని చెప్పుకుంటున్నారు. అయితే వెంకీ అట్లూరి అలాంటి కథను డీల్ చేయగలడా అనేది ఆసక్తికరమైన విషయం. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రాజెక్టుకు అప్పచెప్పటంతో అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ ఆడకపోవటంతో ఇలాంటి డైరక్టర్ కు ధనుష్ వంటి స్టార్ ఓకే చేయటం ఏమిటనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.