బన్నీకి షాక్ ఇచ్చిన ధనుష్-సాయి పల్లవి.. సరికొత్త రికార్డ్..!
తమిళంలో ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `మారి 2`. ఈ చిత్రంలోని `రౌడీబేబీ` సాంగ్ సంచలనం సృష్టించింది. ఈ పాటని ఏకంగా వంద కోట్ల మంది వీక్షించారు. దీంతో ఇప్పుడిది సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్కి షాక్ ఇచ్చింది. ఎవరూ ఊహించిన మార్క్ ని దాటేసింది. సరికొత్త రికార్డులు సృష్టించింది. తమిళంలో ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `మారి 2`. ఈ చిత్రంలోని `రౌడీబేబీ` సాంగ్ సంచలనం సృష్టించింది. ఈ పాటని ఏకంగా వంద కోట్ల మంది వీక్షించారు. దీంతో ఇప్పుడిది సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
సౌత్ ఇండియాలోనే ఈ పాట ఇప్పుడు నెంబర్ వన్గా నిలిచింది. సౌత్లో ఇప్పటి వరకు ఏ పాట ఈ మార్క్ ని చేరుకోలేదు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` సినిమాలోని పాటలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇందులో `బుట్టబొమ్మ` సాంగ్ దాదాపు నలభై కోట్ల వ్యూస్ని దాటేసింది. ఈ ఆల్బమ్లోని పాటలు సైతం కోట్లల్లో వ్యూస్ని రాబట్టాయి. ఈ నేపథ్యంలో బన్నీకి షాక్ ఇచ్చేలా ధనుష్, సాయిపల్లవి జంటగా వచ్చిన `రౌడీ బేబీ` సాంగ్ కొత్త రికార్డు సృష్టించడం విశేషం.
దీనిపై ధనుష్ స్పందించారు. `సౌత్లో ఇప్పటి వరకు ఏ పాట సాధించని రికార్డుని `రౌడీ బేబీ` సాధించిందని ధనుష్ తెలిపారు. ఒకప్పుడు ప్రపంచాన్ని షేక్ చేసిన పాట `కొలవెరి ఢీ` 9వ యానివర్సరీ రోజే ఈ పాట బిలియన్ వ్యూస్ సాధించడం సంతోషంగా ఉందని ధనుష్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఇక `మారి2` చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పుడు యువన్పై యావత్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.