ఇది భారత సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మోహన్‌లాల్‌ను ఎంపిక చేశారు. 1969లో మొదలైన ఈ అవార్డులను ఇప్పటి వరకూ ఎవరెవరు అందుకున్నారంటే?  

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు 2023 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇవ్వనున్నారు. ఈ గౌరవాన్ని ఆయనకు సెప్టెంబర్ 23, 2025న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ప్రదానం చేస్తారు. ఇది భారతదేశంలో సినీ పరిశ్రమలోని వారికి ఇచ్చే అత్యున్నత గౌరవం. ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జ్ఞాపకార్థం దీన్ని స్థాపించారు. 1969లో తొలిసారిగా నటి దేవికా రాణి ఈ అవార్డును అందుకున్నారు. దేవికా రాణి విశాఖపట్టణంలో జన్మించి, బాలీవుడ్ లో స్టార్ గా వెలుగు వెలిగారు.

ఇప్పటివరకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఇండియా ఫిల్మ్ స్టార్స్ 

సంవత్సరంపేరుఫిల్మ్ ఇండస్ట్రీ
1969దేవికా రాణిహిందీ
1970బీరేంద్రనాథ్ సర్కార్బెంగాలీ
1971పృథ్వీరాజ్ కపూర్హిందీ
1972పంకజ్ మల్లిక్బెంగాలీ, హిందీ
1973రూబీ మైయర్స్ (సులోచన)హిందీ
1974బి.ఎన్. రెడ్డితెలుగు
1975ధీరేంద్ర నాథ్ గంగూలీబెంగాలీ
1976కానన్ దేవిబెంగాలీ
1977నితిన్ బోస్బెంగాలీ, హిందీ
1978రాయ్‌చంద్ బోరాల్బెంగాలీ, హిందీ
1979సోహ్రాబ్ మోడీహిందీ
1980పైడి జైరాజ్హిందీ
1981నౌషాద్హిందీ
1982ఎల్. వి. ప్రసాద్తెలుగు, తమిళం, హిందీ
1983దుర్గా ఖోటేహిందీ, మరాఠీ
1984సత్యజిత్ రేహిందీ
1985వి. శాంతారాంహిందీ, మరాఠీ
1986బి. నాగిరెడ్డితెలుగు
1987రాజ్ కపూర్హిందీ
1988అశోక్ కుమార్హిందీ
1989లతా మంగేష్కర్హిందీ, మరాఠీ
1990అక్కినేని నాగేశ్వరరావుతెలుగు
1991భాల్జీ పెంధార్కర్మరాఠీ
1992భూపేన్ హజారికాఅస్సామీ
1993మజ్రూహ్ సుల్తాన్‌పురిహిందీ
1994దిలీప్ కుమార్హిందీ
1995రాజ్‌కుమార్కన్నడ
1996శివాజీ గణేశన్తమిళం
1997కవి ప్రదీప్హిందీ
1998బి. ఆర్. చోప్రాహిందీ
1999హృషికేశ్ ముఖర్జీహిందీ
2000ఆశా భోంస్లేహిందీ, మరాఠీ
2001యశ్ చోప్రాహిందీ
2002దేవ్ ఆనంద్హిందీ
2003మృణాల్ సేన్బెంగాలీ, హిందీ
2004అడూర్ గోపాలకృష్ణన్మలయాళం
2005శ్యామ్ బెనెగల్హిందీ
2006తపన్ సిన్హాబెంగాలీ, హిందీ
2007మన్నా డేబెంగాలీ, హిందీ
2008వి. కె. మూర్తిహిందీ
2009డి. రామానాయుడుతెలుగు
2010కె. బాలచందర్తమిళం
2011సౌమిత్ర ఛటర్జీబెంగాలీ
2012ప్రాణ్హిందీ
2013గుల్జార్హిందీ
2014శశి కపూర్హిందీ
2015మనోజ్ కుమార్హిందీ
2016కె. విశ్వనాథ్తెలుగు
2017వినోద్ ఖన్నాహిందీ
2018అమితాబ్ బచ్చన్హిందీ
2019రజనీకాంత్తమిళం
2020ఆశా పరేఖ్హిందీ
2021వహీదా రెహమాన్హిందీ
2022మిథున్ చక్రవర్తిబెంగాలీ, హిందీ

టాలీవుడ్ నుంచి ఈ అవార్డును ఇప్పటి వరకూ ఐదుగురు స్టార్స్ అందుకున్నారు. 1974 మొదటి సారిగా దర్శకుడు బి.ఎన్. రెడ్డి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆతరువాత 1982 లో తెలుగు, తమిళ, హిందీ నుంచి ఎల్. వి. ప్రసాద్ రెండో సారి ఈ అవార్డ్ సాధించారు. ఇక 1986 లో ప్రముఖ నిర్మాత నాగిరెడ్డి ని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆతరువాత 1990 లో అక్కినేని నాగేశ్వరావు ఈ అవార్డు కు ఎంపిక అవ్వగా, 2009 లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డి . రామానాయుడు , 2016 లో ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను అందుకున్నారు.