మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ 1’ నుంచి క్రేజీ అప్డేట్.. అదిరిపోయే మోషన్ పోస్టర్ వదిలిన టీమ్..
ప్రముఖ తమిళ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన బిగ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్ 1’ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఆడియెన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ అందింది.
ప్రముఖ తమిళ డైరెక్టర్ మణిరత్నం సినిమాలు అంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొనడం సర్వసాధారణం. సామాజిక అంశాలతోనే మూవీని తెరకెక్కించి తన మార్క్ చూపించడంలో ఆయనకాయనే సాటి అని చెప్పాలి. అయితే మణిరత్నం (Mani Ratnam) తన కేరీర్ లోనే తెరకెక్కిస్తున్న బిగ్ ప్రాజెక్ట్ గా ‘పొన్నియన్ సెల్వన్ 1’ (Ponniyan Selvan 1) రూపుదిద్దుకుంది. 2019లోనే ఈ చిత్రాన్ని మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా రెండు సార్లు సినిమా ఆగిపోయినా గతేడాది సెస్టెంబర్ లో షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు.
ఇక ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందుకు లేటెస్ట్ గా ‘పొన్నియన్ సెల్వన్ 1’ త్వరలో రాబోతుందంటూ అప్డేట్ అందించారు. ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ మూవీ నుంచి చాలా కాలం తర్వాత అప్డేట్ రావడంతో ఆడియెన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో రెగ్యూలర్ అప్డేట్స్ రానున్నట్టు తెలుస్తోంది.
రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ లైకా సంస్థ నిర్మిస్తోంది. అలాగే మద్రాస్ టాకీస్ బ్యానర్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యింది. నిర్మాతలుగా మణిరత్నం, అల్లిరజహ సుబస్కరణ్ వ్యహిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తుండగా.. తమిళ స్టార్ హీరో విక్రమ్, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) కూడా నటిస్తోంది. అలాగే త్రిష క్రిష్ణణ్, శోభితా ధూళిపాళ కూడా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.