Asianet News TeluguAsianet News Telugu

కొరటాలకు షాక్ ఇచ్చిన చిరు

 ఇది కొరటాల ఊహించలేదట. దాంతో వచ్చే వేసవి అయినా ఈ సినిమా రిలీజ్ చేద్దామనుకునే కొరటాల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. రామ్ చరణ్ అయినా వచ్చి షూట్ లో పాల్గొని తన పోర్షన్ పూర్తి చేద్దాడనుకుంటే అదీ జరగటం లేదట. మరో ప్రక్క కాజల్ ..పెళ్లి హడావిడిలో ఉంది. 

Chiranjeevi new shock for Koratala Siva jsp
Author
Hyderabad, First Published Oct 16, 2020, 10:26 AM IST

సైరా నరసింహ రెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య టైటిల్ తో ఓ  సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది చిరంజీవికి 152వ సినిమా.. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తోంది. క్రితం సంవత్సరం విజయదశమి కానుకగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా కోకాపేటలో  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మళ్లీ విజయదశమి వచ్చింది కానీ ఓ కొలిక్కి రాలేదు. మధ్యలో కరోనా వచ్చి మొత్తం ప్లాన్ ని చెదరకొట్టింది.  అయితే ఈ చిత్రం షూటింగ్ ని అక్టోబర్ చివరి వారం నుంచి ప్రారంభించాలని కొరటాల శివ ప్లాన్ చేసారు.

 నవంబర్ నుంచి చిరంజీవి షూట్ కు వస్తే సరిపోతుందన్నారు. కానీ చిరంజీవి మాత్రం షూటింగ్ ఇప్పుడు వద్దని చెప్పారని తెలుస్తోంది. ఇంకొద్ది రోజులు షూట్ కు వెయిట్ చేద్దామని ఆయన అన్నట్లు తెలుస్తోంది. కరోనా తీవ్రత తగ్గాక..భయం లేదనుకున్నాక ధైర్యంగా ముందుకు వెళ్దామని ఆయన డిసైడ్ అయ్యారట. ఇది కొరటాల ఊహించలేదట. దాంతో వచ్చే వేసవి అయినా ఈ సినిమా రిలీజ్ చేద్దామనుకునే కొరటాల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. రామ్ చరణ్ అయినా వచ్చి షూట్ లో పాల్గొని తన పోర్షన్ పూర్తి చేద్దాడనుకుంటే అదీ జరగటం లేదట. మరో ప్రక్క కాజల్ ..పెళ్లి హడావిడిలో ఉంది. వీటిన్నటితో ఈ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది..ఎప్పుడు రిలీజ్ చేయాలి..ఇంకెంత కాలం వెయిటింగ్ మోడ్ లో ఉండాలనే ఆలోచనతో కొరటాల ఉన్నారట.

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో చిరంజీవి దేవదాయ-ధర్మాదాయ శాఖలో ఓ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పాత్రపై ఎలాంటి క్లారిటీ లేదు. ‘ఖైదీ నంబర్ 150’ తరువాత కాజల్‌ మరోసారి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షల వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. సామాజిక సందేశమే ప్రధానంశంగా వస్తోన్న చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, నాసర్‌, సాయాజీ షిండేలు కీలక పాత్రల్లో నటించనున్నారు. మణిశర్మ సంగీత స్వరాలు సమాకూర్చుస్తుండగా, తిరు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దసరాకి సినిమాని రిలీజ్ చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios