Asianet News TeluguAsianet News Telugu

సమంత టాక్‌షో కోసం చిరు, బన్నీ, రౌడీ, మిల్కీ బ్యూటీ, రష్మిక

ఈ టాక్‌ షో విశేషాలను పంచుకున్నారు సమంత. మరోవైపు `ఆహా` నిర్వహకుల్లో ఒకరైన అల్లు అరవింద్‌ సైతం పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ఇందులో టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలు పాల్గొనబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

chiranjeevi allu arjun vijay devarakonda tamannah come for samantha talk show arj
Author
Hyderabad, First Published Nov 6, 2020, 8:54 PM IST

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా` లో సమంత హోస్ట్ గా `సామ్‌జామ్‌` టాక్‌ షో నిర్వహిస్తున్నారు. ఇది ఈ నెల 13న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ టాక్‌ షో విశేషాలను పంచుకున్నారు సమంత. మరోవైపు `ఆహా` నిర్వహకుల్లో ఒకరైన అల్లు అరవింద్‌ సైతం పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ఇందులో టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలు పాల్గొనబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

ఫస్ట్ టైమ్‌ సమంత వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ టాక్‌ షోలో మెగాస్టార్‌ పాల్గొనబోతుండటం విశేషం. మెగాస్టార్‌తోపాటు స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, స్టార్‌ హీరోయిన్లు తమన్నా, రష్మిక మందన్నా, క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ వంటి వారు కూడా ఈ టాక్‌ షోలో పాల్గొనబోతున్నట్టు అల్లు అరవింద్‌, నందిని రెడ్డి తెలిపారు. 

అయితే ఈ షో డిజైన్‌ కోసం `కౌన్‌ బనేగా కరోడ్‌పతి`, `కాఫీ విత్‌ కరణ్‌` వంటి వాటిని డిజైన్‌ చేసిన టాప్‌ టీమ్‌ పనిచేసిందట. సమంత ఆలోచనలను, సమాజాన్ని ప్రతిబింబించేలా దీన్ని డిజైన్‌ చేసినట్టు తెలిపారు. దక్షిణాదిలోనే ఇలాంటి షో చూడలేదనే విధంగా ఈ షో ఉంటుందని అల్లు అరవింద్‌ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios