హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్లపై కేసు నమోదైంది. బంజారాహిల్స్ లో ఛాటింగ్ కేసు పెట్టారు.
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Srinivas), ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh)లపై ఛీటింగ్ కేసు నమోదైంది. వీఎస్ శ్రవణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ శుక్రవారం హీరో, నిర్మాతపై బంజరాహిల్స్ లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదనే ఆరోపణలో ఆయన ఈ కేసు పెట్టారు. శ్రవణ్ కుమార్ ఫిర్యాదు ప్రకారం. బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్ తన దగ్గర నుంచి రూ.85లక్షలు అప్పుగా తీసుకున్నారని, 2018, 19 మధ్యలో ఓ సినిమా ప్రొడక్షన్ కోసం ఈ మొత్తం డబ్బుని తీసుకున్నారని తెలిపారు. చాలా మంది టెక్నీషియన్లకి తన అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేశారని శ్రవణ్ వెల్లడించారు.
ఈ మొత్తం తిరిగి ఇవ్వాలని అడగ్గా బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్ ఇద్దరూ సరిగా స్పందించడం లేదని, పైగా తనపై బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపారు. తనని సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తానని చెప్పి డబ్బు తీసుకుని ఇప్పుడు మోసం చేశారని ఆరోపిస్తూ శ్రవణ్ తన ఫిర్యాదులో వెల్లడించారు. శ్రవణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ జరుగుతున్నామన్నారు.
అయితే ఈ కేసుపై నిర్మాత బెల్లంకొండ సురేష్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించాల్సి ఉంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల `అదుర్స్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ లో 'ఛత్రపతి' రీమేక్ లో నటిస్తున్నారు. అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించబోతున్నారు. ఓ స్టార్ డైరెక్టర్ ఈచిత్రానికి వర్క్ చేయబోతున్నారని సమాచారం.