మక్కాలో షారుఖ్ ఖాన్ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
సడెన్ గా మక్కాలో ప్రత్యక్షం అయ్యాడు బాలీవుడ్ బాద్ షా .. షారుఖ్ ఖాన్. సరికొత్త గెటప్ లో కనిపించారు ఇండియన్ టాప్ హీరో. ఇంత సడెన్ గా షారుఖ్ మక్కా ఎందుకు వెళ్లాడో తెలుసా....?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన స్టార్ హీరో.. వరుస సినిమాలతో సందడి చేయబోతున్నాడు. ఫ్యాన్స్ కు డబుల్ డోస్ రెడీ చేస్తున్నాడు. ఈక్రమంలోనే షారుఖ్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో కలిసి డుంకి సినిమా చేస్తున్నాడు. ఇక ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడా.. ఇందులో కీలక షెడ్యూల్ ను సౌదీ అరేబియాలో చేస్తున్నారు. ఈ షూటింగ్ కోసం మూవీ టీమ్ అంతా సౌది వెళ్లింది.
ఇక అక్కడ షూటింగ్ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న తరువాత షారుఖ్ ఖాన్ అక్కడి పవిత్ర మక్కా మజీద్ ను సందర్శించారు. పవిత్ర నగరాన్ని సందర్శించుకున్నాడు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ మక్కాలో ఉమ్రా చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఒక అభిమాని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోటోలో షారుఖ్ డిఫరెంట్ గా ఉన్నాడు. వాళ్ల ట్రెడిషన్ ప్రకారం వైట్ కలర్ క్లాత్ ఒక వైపుగా వేసుకుని ఉన్నారు షారుఖ్.
ఉమ్రా అంటే సౌదీ అరేబియాలో చేసే మక్కా యాత్ర అని అర్ధం. స్పెషల్ డివోషనల్ లుక్ లో ఉన్న షారుఖ్ ఖాన్ ఫోటోలు వైరల్ అవ్వడంతో అది చూసిన ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఆ పిక్ ను నెట్టింట మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే..ఇక షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పఠాన్ మూవీ షూటింగ్ పూర్తీ చేయగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. నెక్ట్స్ ఇయర్ జనవరి 25న రిలీజ్ కు ముస్తాబుతుుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు.
అటు తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీ చేస్తున్నాడు షారుఖ్ ఖాన్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై అటు బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ సౌత్ లో షారుఖ్ మార్కెట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. అటు అట్లీకి కూడా వరుస అవకాశాలు క్యూ కడతాయి అంటున్నారు సినిమా పండితులు