Asianet News TeluguAsianet News Telugu

హౌస్లో ఐదుగురు... ఫస్ట్  టాస్క్ ఇచ్చిన నాగ్, టాస్క్ విన్నర్ ఎవరు, ఏం గెలుచుకున్నారంటే!

 ఐదుగురు మధ్య చిన్న టాస్క్ నిర్వహించారు నాగార్జున. హౌస్ లో ఉన్న సింగిల్ బెడ్ గెలుచుకునే ఛాన్స్ ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ కి అవకాశం ఇచ్చారు.

bigg boss season 5 nagarjuna gave first task to the first five contestants
Author
Hyderabad, First Published Sep 5, 2021, 7:42 PM IST

బిగ్ బాస్ కర్టైన్ రైసింగ్ ఎపిసోడ్ రన్ అవుతుండగా... ఒక్కొక్కరిగా వేదికపైకి వస్తున్న సెలెబ్రిటీలు బిగ్ బాస్ ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 మొదటి కంటెస్టెంట్ గా యూట్యూబర్ సిరి హన్మంత్ ఎంట్రీ ఇవ్వగా.. అనంతరం విజె సన్నీ, నటి లహరి, సింగర్ శ్రీరామ్ చంద్ర, యాని మాస్టర్ హౌస్లోకి నెక్స్ట్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. 


హౌస్లోకి ప్రవేశించిన కంటెస్టెంట్స్ మధ్య పరిచయాలు, పరాచకాయలు మొదలయ్యాయి. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఈ ఐదుగురు మధ్య చిన్న టాస్క్ నిర్వహించారు నాగార్జున. హౌస్ లో ఉన్న సింగిల్ బెడ్ గెలుచుకునే ఛాన్స్ ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ కి అవకాశం ఇచ్చారు. ఇక ఈ టాస్క్ పేరు 'దండ వేసి దండం పెట్టు'. మ్యూజిక్ చైర్స్ మాదిరి సాంగ్ ప్లే చేయగానే చేతిలో ఉన్న దండను మరో కంటెస్టెంట్ మెడలో వేయాలి, సాంగ్ స్టాప్ అయిన సమయంలో ఎవరి దగ్గర దండ ఉంటుందో వారు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. 


ఈ టాస్క్ ఐదుగురు కంటెస్టెంట్ మధ్య జరుగగా... చివరి వరకు దండ తాకకుండా ఎవరికీ దొరకకుండా జాగ్రత్తపడి విజె సన్నీ టాస్క్ గెలిచారు. దీనితో హౌస్ లో ఉన్న సింగిల్ బెడ్ ని సన్నీ గెలుచుకున్నారు. బిగ్ బాస్ సన్నీని విన్నర్ గా ప్రకటించారు. కాగా ఆరవ కంటెస్టెంట్ గా లోబో హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.   

Follow Us:
Download App:
  • android
  • ios