నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. బండ్ల గణేష్‌ హీరోగా రచ్చ షురూ చేశారు.

సంచలన నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ రచ్చ షురూ చేశాడు. తన కొత్త సినిమా షూటింగ్‌ని ప్రారంభించాడు. బండ్ల గణేష్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. వెంకట్‌ చంద్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న నేపథ్యంలో యూనిట్‌ స్పందించింది.

దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, `తమిళ హిట్ చిత్రం `ఒత్తు సెరుప్పు సైజ్ 7`కి‌ రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్థిబన్‌ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్‌ప్రైజ్. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం` అని చెప్పారు. 

 ఈ చిత్రానికి కళా దర్శకత్వం: గాంధీ, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: లైనస్ మధిరి, దర్శకత్వం: వెంకట్ చంద్ర, నిర్మాణం: స్వాతి చంద్ర. `ఒత్తు సెరుప్పు సైజ్ 7`ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.