బాలీవుడ్ వుడ్ బ్యూటీ సన్నీ లియోన్ కు బిగ్ షాక్ తగిలింది. క్షమాపణలు చెప్పాలంటూ.. బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంతకీ అంత పెద్ద నేరం సన్నీ లియోన్ ఏం చేసింది..?
బాలీవుడ్ ఐటమ్ బాంబ్ సన్నీ లియోన్ వివాదంలో చిక్కుకుంది. ఈమధ్య సినిమాలకు దూరంగ ఉంటున్న సెక్సీ క్వీన్ ను వివాదాలు కొత్తేం కాదు. సన్నీ చేసిన చాలా పాటలు విదాదాలకు దారి తీశాయి. సెగలు పుట్టించే అందాలతో కుర్రాలకు నిద్ర లేకుండా చేసే సన్నీ.. తన డాన్స్ లతో మెస్మరైజ్ చేస్తుంది. అయితే రీసెంట్ గా ఆమె మరో ఆల్బమ్ సాంగ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ ఆల్బమ్ సాంగ్ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తోంది.
లేటెస్ట్ గా నాచే మై మధు బన్ రాధికా సాంగ్ ను రిలీజ్ చేసింది సన్నీ. ఈ వీడియో రిలీజ్ అయిన రోజులోనే సూపర్ రెస్పాన్స్ సాధించింది. రెస్పాన్స్ తో పాటు అంతే వివాదాన్ని రాజేసింది. ఈ పాటను కనికా కపూర్, అరింద్ కలిసి పాడారు. అయితే ఈ పాట హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందంటూ.. నెటిజన్లు మండి పడుతున్నారు. హిందీవులను అవమానపరిచే విధంగా ఉన్న ఈ పాటను బ్యాండ్ చేయాలంటూ డిమాండ్ చస్తున్నారు.
అంతే కాదు ఈ పాటలో నటించినందకు సన్నీ క్షమాపణలు చెప్పాలంటూ.. ఉత్తర ప్రదేశ్ బ్రహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.కనికా పాడిన ఈ పాటలో రాధను అవమానించేలా ఈ పాట ఉందంటూ వారు మండి పడుతున్నారు. అందకే ఈ పాటకు సంబంధించిన వారిపూ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారి పై చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్లి న్యాయం జరిగేలా పోరాడటానికి వెనకాడము అంటున్నారు.
AlsoRead : 2021 మిస్ అయినా... నెక్ట్స్ ఇయర్ అంతకు మించి ట్రీట్ ఇస్తామంటున్న స్టార్ హీరోలు
గతంలో చాలా వివాదాలు సన్నీని చుట్టుముట్టాయి. ఇప్పుడు ఈ వివాదం కూడా బాలీవుడ్ లో రచ్చ రచ్చ అవుతుంది. తన బ్యూటీతో బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా క్రేజ్ సంపాధించిన సన్నీ లియోన్. బోల్డ్ మూవీస్ లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించింది. ప్రస్తుతం పెళ్ళి చేసుకుని అటు లాస్ ఎంజల్స్ లో ఎక్కువ రోజులు ఉంటూ.. అప్పుడప్పుడు బాలీవుడ్ ను పలకరిస్తుంది సన్ని. కొంత మంది పిల్లలను అడాప్ట్ చేసుకుని పెంచుకుంటుంది సన్ని.
