యాంకర్ రష్మి, సుధీర్ ల మధ్య బుల్లితెరపై కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండుతుంది. వీరి కాంబినేషన్ లో షో అంటే అది పక్కా హిట్ అనే నమ్మకం అందరిలో ఉంటుంది. 

యాంకర్ రష్మి, సుధీర్ ల మధ్య బుల్లితెరపై కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండుతుంది. వీరి కాంబినేషన్ లో షో అంటే అది పక్కా హిట్ అనే నమ్మకం అందరిలో ఉంటుంది. ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఇలా రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ వాటిని ఈ జంట కొట్టిపారేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి ప్రముఖ ఛానెల్ లో ప్రసారితమవుతున్న 'ఢీ జోడి' ప్రోగ్రామ్ కి యాంకర్స్ గా పని చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తిరుపతిలో ఈ నెల 9న 10కె రన్ ఉందని.. దీనికి ముఖ్య అతిథులుగా సుధీర్, రష్మి హాజరుకానున్నట్లు ఓ పోస్టర్ ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.

ఈ సంగతి రష్మి వరకు వెళ్లడంతో దీనిపై స్పందించింది ఈ హాట్ యాంకర్. ఇదొక ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. ఈ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

'నాకు ఈ ఈవెంట్ కి ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎవరూ దీని గురించి సంప్రదించలేదు. నాకు చెప్పకుండానే పోస్టర్ లో నా ఫోటో పెట్టి ఈవెంట్ కి హాజరవుతున్నట్లు పోస్ట్ చేశారు. దీని స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే వారికి తెలియజేయండి' అంటూ చెప్పుకొచ్చింది. 

Scroll to load tweet…