ఈ మధ్య అనసూయ సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ అయ్యారు. ఆమె ప్రతి విషయం షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ మైండ్ గేమ్ ఆడుతున్న ఫొటో షేర్ చేసిన అనసూయ చాలా కష్టమన్న అభిప్రాయం వెల్లడించారు.  

నవ్వే వాళ్ళు నవ్వని ఏడ్చే వాళ్ళు ఏడవనీ నేను మాత్రం తగ్గేది లేదంటుంది అనసూయ. ఆమెపై సోషల్ మీడియా ట్రోల్స్ పెరిగాక మరింత యాక్టీవ్ అయ్యారు. గతం కంటే ఎక్కువగా పోస్ట్స్ పెడుతున్నారు. ఒకప్పుడు అనసూయ ఫోటో షూట్స్ తో పాటు కొన్ని ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసేవారు. ప్రస్తుతం ఆమె తన ప్రతి మూమెంట్ షేర్ చేస్తుంది. దీనికి ఒక కారణం కూడా ఉంది. హేటర్స్ మరింత కుళ్ళుకోవాలనేది ఆమె ఆలోచన. ఇటీవల నా హేటర్స్ కి నా యాటిట్యూడే సమాధానం అంటూ ఒక వీడియో షేర్ చేసింది. 

కాగా అనసూయకు 'జంగా' గేమ్ సాల్వ్ చేయడం చాలా కష్టంగా ఉందట. ఆ విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. జంగా గేమ్ ఆడటం నిజంగా కష్టం అబ్బా అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. ఇక అనసూయ ఇంస్టాగ్రామ్ వైరల్ అవుతుంది. సదరు పోస్ట్ కి ఫ్యాన్స్, ట్రోలర్స్ తమదైన కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్న అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు ముఖం చాటేశారు. జబర్దస్త్ మానేశాక బుల్లితెరపై ఆమె సందడి తగ్గింది. స్టార్ మా లో ప్రసారమైన సింగింగ్ షో కూడా ముగియడంతో అసలు కనిపించడం లేదు. సినిమాల్లో ఆఫర్స్ పెరగ్గా ఆమెకు బుల్లితెర అంటే చిన్నచూపు కలిగింది. క్రేజీ ఆఫర్స్ వస్తుండగా యాంకరింగ్ వదిలేశారు. 

View post on Instagram

ప్రస్తుతం అనసూయ పుష్ప 2 లో నటిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూట్ రామోజీ సిటీలో ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తున్నారు. వీటితో పాటు పలు వెబ్ సిరీస్లు,సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.