అనసూయ పోస్ట్ వైరల్.. ట్రోలర్స్ కి ఝలక్.. మళ్లీ మొదలైన రచ్చ..
అనసూయ ఈ వార్తని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్లో వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు అనసూయపై మరోసారి రెచ్చిపోతున్నారు.
యాంకర్ అనసూయ తరచూ ట్రోల్స్ కి గురవుతున్న విషయం తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు నెటిజన్లు ఏదో రకంగా విమర్శలు చేస్తుంటారు. ఆమె డ్రెస్, ఫోటో షూట్లు, ఆమె చేసే కామెంట్లని ట్రోల్ చేస్తూ రచ్చ చేస్తుంటారు. దీనికితోడు `ఆంటీ` అంటూ ఆ మధ్య దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో మండిపోయిన అనసూయ కొందరిపై కేసులు కూడా పెట్టింది. వారికి శిక్ష కూడా పడిందట. ఆ విషయాన్ని ఇటీవలే పేర్కొంది. ఇకపై తాను కూడా వాటిపై పెద్దగా రియాక్ట్ కానని, తాను ఏదైనా చేయగలననే సందేశం ట్రోలర్స్ కి రీచ్ అయితే చాలు అని చెప్పింది.
తాజాగా హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారు. మహిళలను కించపరిచేలా, అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్లలో ట్రోలింగ్ చేసినా, ఫోటోలు మార్ఫింగ్ చేసినా కఠినమైన శిక్షలుంటాయని పేర్కొన్నారు. వారు పెట్టే పోస్టుల పట్ల తమకు ఫిర్యాదులు అందిస్తే ఆ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఇలాంటి కేసులు 20 మందిపై నమోదు కాగా, ఎనిమిది మందిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ట్రోలర్స్ ఆట కట్టించేందుకు సిటీ పోలీసులు గట్టిగానే చర్యలు తీసుకుంటున్నారని అర్థమవుతుంది.
తాజాగా అనసూయ ఈ వార్తని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్లో వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు అనసూయపై మరోసారి రెచ్చిపోతున్నారు. తమదైన పోస్టులతో రచ్చ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మరోసారి అనసూయని ట్విట్టర్ వేదికగా `ఆంటీ`అంటూ కామెంట్లు పెడుతూ రెచ్చిపోతున్నారు. కొందరు నెటిజన్లు `ఇది మీ పోరాట ఫలితమే` అని ఆమెకి కితాబిస్తున్నారు. చాలా మంది మహిళలకు నువ్వే ఆదర్శమంటున్నారు. కానీ కొందరు నెటిజన్లు `ఆంటీలు ఆంటీల లాగా ఉంటే ప్రాబ్లమ్ లేదని, అసభ్యకరమైన ఫోటోలు పెడితే ఘాటునే రిప్లై ఇస్తామని, ఇలాంటి అసభ్యకర ఫోటోలు పెడితే మీపై కూడా కేసులు పెడతామంటున్నారు. పదే పదే `అంటీ` అంటూ మరోసారి అనసూయని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఏదేమైనా అనసూయ ఏం చేసినా ఇప్పుడు నెట్టింట రచ్చగా మారుతుండటం గమనార్హం. అనసూయ టీవీ షోస్ మానేసిన విషయం తెలిసిందే. ఆమె జబర్దస్త్ షోకి దాదాపు తొమ్మిదేళ్లుగా యాంకర్గా చేసింది. ఈ షోతోనే క్రేజ్ని, పాపులారిటీని, ఇమేజ్ని సొంతం చేసుకుంది. గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ని పెంచుకుంది. అదే సమయంలో గ్లామర్ షో కారణంగా పలు విమర్శలకు గురయ్యింది. ఈ క్రమంలోనే ఆమెపై ట్రోల్స్ నడిచాయి. కానీ ఇటీవల అనసూయ సైలెంట్ అయ్యింది. షో మానేసి సైలెంట్గా సినిమాలు చేసుకుంటుంది.
ఇటీవల ఆమె `రంగమార్తాండ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె ప్రకాష్ రాజ్(రంగమార్తాండ) కోడలిగా నటించారు. గడుసు కోడలిగా ఆకట్టుకున్నారు. నేటి తరం కోడళ్లని ప్రతిబింబించారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఆమె నటించిన సినిమాలన్నీ రిలీజ్ రెడీ అవుతున్నాయి.