మహేష్బాబు నటించిన `సర్కారు వారి పాట` చిత్రంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
మహేష్బాబు(Maheshbabu) నటించిన `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata)మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి మొదట నెగటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్ల పరంగా దుమ్మరేపింది. వంద కోట్లకుపైగా షేర్ని సాధించింది. రెండువందల కోట్ల(గ్రాస్) క్లబ్లో చేరింది. ఇందులో మహేష్ సరికొత్త మ్యానరిజం, కీర్తిసురేష్ అందాలు, నటన, పరశురామ్ టేకింగ్, బోల్డ్ డైలాగ్లు, సీన్లు సినిమాకి ప్లస్ అయ్యాయి. సంగీతం మరో స్పెషల్ హైలైట్. దీంతో సినిమా నష్టాల నుంచి గట్టేక్కింది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంపై ప్రముఖ ఆటోమోబైల్ మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర(Anand Mahindra) స్పందించడం, ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.ప్రముఖ ఆటోమోబైల్కి చెందిన వ్యాపారవేత్త అనుపమ్ తరేజా చేసిన పోస్ట్ కి ఆనంద్ మహీంద్ర రియాక్ట్ అయ్యారు. `సర్కారు వారి పాట` సినిమాని కచ్చితంగా చూస్తానని తెలిపారు. మరి ఇంతక అనుపమ్ తరేజా ఏం పోస్ట్ చేశారంటే, `సర్కారు వారి పాట` చిత్రంతో మహేష్బాబు `జావా మెరూన్`(Jawa Maroon) అనే ఖరీదైన బైక్ని వాడతారు. మహేష్, జావా కాంబినేషన్ అద్భుతంగా ఉందని, సినిమా సక్సెస్లో భాగమైందని, సినిమా సక్సెస్తో దేశ వ్యాప్తంగా మహేష్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, ఈ సినిమాని చూడాలని ఆయన ట్వీట్ చేశారు.
దీనికి రియాక్ట్ అయ్యారు ఆనంద్ మహీంద్ర. అనుపమ్ తరేజా పోస్ట్ చేసిన ఓ వీడియోకు స్పందనగా రీట్వీట్ చేస్తూ, `అన్బీటబుల్ కాంబినేషన్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, జావా మెరూన్లను చూడకుండా ఎలా ఉండగలను. ప్రస్తుతం నేను న్యూయార్క్లో ఉన్నాను. న్యూ జెర్సీకి వెళ్లి సినిమా ఎక్కడ ప్రదర్శించబడితే అక్కడికి వెళ్లి చూస్తాను` అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే జావా మెరూన్ మహీంద్ర గ్రూప్కి సంబంధించి ఆటోమోబైల్కంపెనీలో ఒకటి. మహీంద్ర గ్రూప్ లాంచ్ చేసిన జావా మెరూన్ మంచి ఆదరణ పొందుతుంది. ఈ నేపథ్యంలో మహేష్ ఈ బైక్ ని `సర్కారు వారిపాట` చిత్రంలో వాడటంతో దాన్ని ప్రమోట్ చేసినట్టయ్యింది.
