ఆ పత్రికలో వచ్చిన వార్తపై బన్నీ సీరియస్!
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై మీడియాలో గత కొంతకాలంగా దుష్ప్రచారం జరుగుతోంది. ఎవరు చేస్తున్నారో...ఎందుకు చేస్తున్నారో తెలియకుండా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి.
మీడియాలో ఒక పక్షంగా రాసే వార్తలకు ఎప్పుడూ వాల్యూ ఉండదు. ఏదో కోపం మనస్సులో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు రాసే వాళ్లను క్షమించటం కష్టమే. ఇప్పుడు బన్ని ఫ్యాన్స్ ఇదే విషయం సోషల్ మీడియాలో అంటున్నారు. వారంతా ఓ ఇంగ్లీష్ డైలీపై మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై మీడియాలో గత కొంతకాలంగా దుష్ప్రచారం జరుగుతోంది. ఎవరు చేస్తున్నారో...ఎందుకు చేస్తున్నారో తెలియకుండా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అవన్ని ఈ చిత్రం హైప్ను తగ్గించేవిధంగా జరుగుతున్నాయి. దాంతో ఈ విష ప్రచారం చిత్ర యూనిట్కు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
రీసెంట్ గాసినిమా కో-డైరెక్టర్తో బన్నీకి గొడవ జరిగిందనే వార్త ప్రచారంలోకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. నలుగురు కలిసి పనిచేసే షూటింగ్ సమయంలో మాటా మాటావస్తూంటాయని జరుగుతుంటాయని, అయితే మీడియాలో కొందరు పనిగట్టుకుని ఈ వ్యవహారాన్ని పెద్దదిగా చూపించే ప్రయత్నం జరిగిందని చిత్ర యూనిట్ అంటోంది.
దాన్ని మర్చిపోయేలోగా ఇటీవల ఓ ఇంగ్లీష్ దినపత్రికలో సినిమా ఫలితం గురించి ఓ ఆర్టికల్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తరచుగా గొడవలు జరుగుతున్నాయని, ఈ సినిమాపై బన్నీకి ఏ మాత్రం ఇంట్రస్ట్ లేదని, ఈ సినిమా మరో `బ్రహ్మోత్సవం` కాబోతోందని ఆర్టికల్ ప్రచురితమైంది. ఈ వార్తపై బన్నీ చాలా కోప్పడ్డారట. ఆ పత్రికలో ఆ న్యూస్ రాసిన వాళ్లు ఎవరో ఎంక్వీరీ చేసి మరీ మందలించారని తెలుస్తోంది. ఇంకా 40 శాతం కూడా షూటింగ్ పూర్తి చేసుకోని సినిమా రిజల్ట్ గురించి ముందుగానే ఎలా ఊహించి రాసేస్తారని బన్నీ సీరియస్ అయ్యాడట.