కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రాజశేఖర తనయ శివాత్మిక!
2019లో విడుదలైన దొరసాని అనే పీరియాడిక్ లవ్ డ్రామాతో శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా దొరసాని మూవీతో హీరోగా మారారు. ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో నటిస్తున్నారు.
యాంగ్రీ హీరో రాజశేఖర్ చిన్న కుమార్తె కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఓ చిత్రానికి శివాత్మిక సైన్ చేయడం జరిగింది. యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ కి శివాత్మిక జంటగా నటించనుంది. దర్శకుడు నంద పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇక ఈ మూవీ మార్చ్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శివాత్మిక కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందిపుచ్చుకోవడం విశేషమే అని చెప్పాలి.
2019లో విడుదలైన దొరసాని అనే పీరియాడిక్ లవ్ డ్రామాతో శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా దొరసాని మూవీతో హీరోగా మారారు. ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో నటిస్తున్నారు.
రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంలతో పాటు అనసూయ రంగర్తాండ మూవీలో ప్రధాన రోల్స్ చేస్తున్నారు. రంగమార్తాండ మూవీలో శివాత్మిక, ప్రకాష్ రాజ్ కూతురిగా కనిపిస్తారని సమాచారం. మరోవైపు రాజశేఖర్ వరుసగా రెండు చిత్రాలు ప్రకటించారు. ఆయన తన 91 మరియు 92వ చిత్రాలపై అధికారిక ప్రకటన చేయడం జరిగింది.