సారాంశం

ముంబ‌యిలోని జియో వ‌రల్డ్ సెంట‌ర్‌లో ప్ర‌పంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (WAVES) 2025 చాలా ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం నాలుగురోజులు పాటు జరగబోతోంది. ఈక్రమంలో చిరంజీవితో పాటు అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటీనటులు ఇందులో పాల్గొన్నారు. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఈ సమ్మిట్ లో మాట్లాడుతూ.. చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.? 
 


ముంబయ్ లో స్టార్ట్ అయిన వేవ్స్  సమ్మిట్లో  సినీతారలు సందడి చేశారు. ఈ సందర్భంగా స్టార్ హీరోలు మాట్లాడుతూ.. తమ కెరీర్ లో జరిగిన సంఘటనలు వెల్లడించారు. ఈక్రమలో తమ తోటి నటుల గురించి కూడా వారు మాట్లాడారు. ఈక్రమంలోనే చిరంజీవి తనకు ప్రేరణగా నిలిచిన నటుల గురించి చెప్పగా.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చిరంజీవి గురించ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  తెలుగు సినిమా గర్వించదగ్గ అతికొద్ది మంది దిగ్గజ నటులలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.  తెలుగు సినిమాకు మైకెల్ జాక్సన్ స్టెప్పులు నేర్పించిన మెగాస్టార్..  ఇండియన్ సినిమాకి కూడా ఎంతో చేశారు. ట్రెండ్ కి తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ.. కోట్ల మంది అభిమానులను సంపాధించుకున్నారు చిరంజీవి. 

అయితే తనపై లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఇలాంటి కామెంట్సే చేశారు.వేవ్స్ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ..  తెలుగు సినిమాకి చిరంజీవి గారు డాన్స్, డిసిప్లిన్ అలాగే హీరోయిజం వంటివి నేర్పించారు. ఎంతో మందికి ఆయన ప్రేరణగా నిలిచారని అన్నారు. ఇక ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. మెగాస్టార్ పై  అక్షయ్ లేటెస్ట్  కామెంట్స్ ను మెగా ఫ్యాన్స్  వైరల్ చేస్తున్నారు. 

జియో వ‌రల్డ్ సెంట‌ర్‌లో ప్ర‌పంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (WAVES) 2025 చాలా ఘనంగా స్టార్ట్ అయ్యింది.  కేంద్ర సమాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఈ స‌మ్మిట్ ను ప్రధాని మోదీ ప్రరంభించారు.  ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు సాగ‌నున్న ఈ ఈవెంట్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ సందడి చేయబోతున్నారు.

చిరంజీవితో పాటు ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజినీకాంత్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి  ఆమిర్ ఖాన్‌, అక్ష‌య్ కుమార్, త‌దిత‌రులు పాల్గున్నారు. ఇక ఈ స్టార్ హీరోలకు  నిర్వాహ‌కులు ఘ‌న స్వాగ‌తం పలికారు. బుధ‌వార‌మే చిరంజీవి ఈ కార్య‌క్ర‌మం కోసం హైద‌రాబాద్ నుంచి ముంబ‌యి చేరుకున్న విష‌యం తెలిసిందే. 

అంతర్జాతీయ స్థాయిలో భారతీయ వినోద పరిశ్రమను గ్లోబల్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'వేవ్స్' సదస్సును నిర్వహిస్తోంది.నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం. ఇక్కడ ఆయన మీడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ కార్య‌క్ర‌మం కోసం ప్ర‌ధాని మోదీ ఏకంగా 10 గంట‌ల స‌మ‌యాన్ని కేటాయించ‌డం విశేషం.