మెగా హీరోకు హెల్ప్ చేసిన అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' చిత్రం మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 8న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, తాజాగా మరోసారి రిలీజ్ డేట్ను వాయిదా వేశారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందించిన ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అసలే కరోనా కారణంగా జనాలు థియోటర్స్ రావటం తగ్గించేసారు. ఆంధ్రాలో నైట్ కర్ఫూ నడుస్తోంది. దాంతో అక్కడ మూడు షోలు..అదీ ఫిప్టీ పర్శంట్ ఆక్యుపన్సీతో నడుస్తున్నాయి. ఆ మేరకు కలెక్షన్స్ డ్రాప్ పూర్తిగా ఉంది. ఈ నేపధ్యంలో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే పరిస్దితి ఏమిటి..ఇబ్బందికరంగా ఉంటుంది. అది గమనించే అక్కినేని హీరో అఖిల్ వెనక్కి తగ్గారు..మెగా హీరో వైష్ణవ్ తేజ్ కు దారి ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే...
ఇంకో వారం లేటుగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మించిన సినిమా ఇది. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ సినిమాని మొదట అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్రబృందం సినిమాని మరో వారం వాయిదా వేస్తూ, అక్టోబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్లని విడుదల చేశారు. అందుకు కారణం కొండపాలం రిలీజ్ అని తెలుస్తోంది.
లేటెస్ట్ గా ఉప్పెన సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ అటు యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొండపాలెం అనే నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ మూవీని అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసారు. ఈ చిత్రంలో టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక డైరెక్టర్ క్రిష్ నల్లమల అటవీ ప్రాంతంలో 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసారు. తొలుత ఈ చిత్రాన్ని ఓటీటిలోనే విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకే మేకర్స్ మొగ్గు చూపారు.