అజిత్‌ హీరోగా జీ సినిమాతో కలిసి బోనీ కపూ ర్‌ నిర్మించిన చిత్రం ఇది. బాలీవుడ్‌ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో క్రితం నెలలో విడుదలైంది. చిత్రంలో పోరాట దృశ్యాలు, బైక్‌ ఛేజింగ్‌ సన్నివేశాలు హాలీవుడ్‌ స్థాయిలో ఉన్నాయంటూ ప్రశంసలు కురిసాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ నటించిన ‘వలిమై’చిత్రం క్రిందటి నెల ఫిబ్రవరి 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ట్రైలర్‌కి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ను పెంచేసింది. దానికి తోడు ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలేవి థియేటర్స్‌లో విడుదల కాకపోవడంతో ‘వలిమై’పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య  ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్‌ పాన్‌ ఇండియా మూవీ ‘వలిమై’ని ప్రేక్షకులు జస్ట్ ఓకే ఫిల్మ్ గా చూసారు.

 ఈ మూవీతో టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ విలన్‌గా కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ కన్నడ, మలయాళంలో రిలీజైన వలిమై.. తమిళనాట రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. థియోటర్ లో చూడని వాళ్లు ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో వలిమై ఓటీటీలో సైతం సందడి చేసేందుకు రెడీ అవుతోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మార్చి 25 నుంచి ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ డీల్‌కు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటిటిలో ...అన్ని భాషల్లోని ఒకేసారి తీసుకొస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో పుష్ప మూవీ కూడా ప్రాంతాల వారీగా ఒక్కో తేదీలలో స్ట్రీమింగ్ చేయగా.. వలిమై కూడా తమిళంలో కొన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసే చాన్స్ ఉన్నట్లు చెప్తున్నారు.

వలిమై పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం. డ్రగ్స్‌ సరఫరా, చైన్‌  స్నాచింగ్‌, హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ చుట్టూ కథ సాగుతోంది. ఆన్‌లైన్‌ వేదికగా నేరాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ని, ఆ గ్యాంగ్‌ లీడర్‌ని పోలీసులు ఎలా అంతం చేశారనేదే ఈ సినిమా కథ. రోటీన్‌ కథనే ఎంచుకున్న దర్శకుడు వినోద్‌.. అజిత్‌కి తగ్గట్లుగా భారీ యాక్షన్‌ సీన్స్‌ని, బైక్‌ రేసింగ్‌ నేపథ్యాన్ని తీసుకొని సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం అజిత్‌, కార్తికేయ మధ్య వచ్చే బైక్‌ ఛేజ్‌ సీన్స్‌, యాక్షన్‌ సన్నివేశాలే.